close
Choose your channels

తిరుపతి రుయాలో ఘోరం.. 11 మంది ప్రాణాలు బలిగొన్న 15 నిమిషాలు!

Tuesday, May 11, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తిరుపతిలోని రుయా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా మరణ మృదంగం మోగింది. రుయా ఆసుపత్రిని ప్రభుత్వం జిల్లాస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లా నుంచే చుట్టుపక్కల జిల్లాల కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. నిన్న సాయంత్రం ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు అయిపోవడంతో ఆక్సిజన్‌ అందక 11 మంది బాధితులు మరణించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ధృవీకరించారు. ఆస్పత్రి ఆవరణలోనే 11వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్‌ ట్యాంక్‌ ఉంది. దీని నుంచే రుయా ఆస్పత్రిలోని వెంటిలేటర్‌, ఐసీయూ, బెడ్లకు ఆక్సిజన్‌ సరఫరా అవుతుంది.

Also Read: ఏపీ నుంచి వచ్చే కొవిడ్ పేషెంట్స్‌కు తెలంగాణలోకి నో ఎంట్రీ..

అయితే సోమవారం సాయంత్రానికి నిల్వలు అయిపోయే అవకాశముందని సిబ్బంది ముందుగానే అధికారులకు చెప్పారు. అధికారులు సైతం వెంటనే స్పందించి తమకు ఆక్సిజన్‌ సరఫరా చేసే చెన్నైకి చెందిన లిండేన్‌ కంపెనీకి సమాచారం అందించారు. చెన్నైలో సాయంత్రం 4 గంటలకు ఆక్సిజన్‌ ట్యాంకర్‌ బయల్దేరింది. నిబంధనల ప్రకారం ఆక్సిజన్‌ ట్యాంకర్‌ గంటకు 40 కిలోమీటర్లకు మించి వేగంతో ప్రయాణించకూడదు. దీంతో... అది తిరుపతికి చేరుకునే సరికి ఆలస్యమైంది. దీంతో 11 మంది మృతి చెందారు. రాత్రి 7 గంటలకు ట్యాంకులో ఆక్సిజన్‌ నిల్వలు 3 కేఎల్‌కు పడిపోయాయి. దీంతో సరఫరాకు సరిపడా ప్రెషర్‌ అందలేదు.

ఫలితంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సాధారణ ఆక్సిజన్‌ బెడ్లు, మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో ఉన్న వెంటిలేటర్‌ బెడ్లపై చికిత్స పొందుతున్న బాధితులకు ఆక్సిజన్‌ సరఫరా ఆగిపోయింది. మొదటి అంతస్తులోని ఐసీయూ వార్డులో 51మంది చికిత్స పొందుతున్నారు. వీరిలోనే ఎక్కువమంది చనిపోయారు. కాగా.. సోమవారం రాత్రి 7 గంటలకు ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడగా... నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి అధికారులు, సిబ్బంది సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు ప్రయత్నించారు. 7.45 గంటలకు చెన్నై నుంచి వచ్చిన ట్యాంకర్‌తో ఆస్పత్రిలోని ట్యాంకును నింపి.. సరఫరాను యథాతథ స్థితికి తీసుకొచ్చారు. ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కలిగిన 15-30 నిమిషాలే కీలకంగా మారాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేవలం 5 నిమిషాల ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగానే ఎక్కువ మంది చనిపోయారని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.