close
Choose your channels

విశాఖ హిందూస్థాన్‌లో ప్రమాదం.. 11 మంది మృతి

Saturday, August 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాఖలో మరో ప్రమాదం సాగర వాసులను భయాందోళనలకు గురి చేసింది. హిందూస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్‌లో క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో 10 మంది మృతి చెందారు. క్రేన్‌ను తనిఖీ చేస్తుంగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న 11 మంది మృతి చెందారు. క్రేన్ కింద మరికొందరు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే హిందూస్థాన్ షిప్ కొనుగోలు చేసిన ఈ క్రేన్ ప్రమాద సమయంలో 15 మంది ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎల్జీ గ్యాస్ లీకేజీ, ట్యాంక్ పేలుడు లాంటి ప్రమాదాలు జరగ్గా.. తాజాగా షిప్ యార్డు ఘటన... ఇలాంటి వరుస ఘటనలు.. విశాఖ వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.