close
Choose your channels

తెలుగు రాష్ట్రాల ప్రజల విషయంలో రైల్వే కీలక నిర్ణయం

Monday, May 10, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా మహమ్మారి దేశమంతా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కరోనా కట్టడికి అవసరమైన మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణల నుంచి ఢిల్లీ వెళ్లే రైలు ప్రయాణికులకు షరతులు విధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రయాణికులంతా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సౌత్ సెంట్రల్ రైల్వే ఆదేశాలు జారీ చేసింది.

‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే రైలు ప్రయాణికులందరూ విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్(రెండు డోసులు) సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిన వ్యక్తులెవరైనా ఉంటే మాత్రం వారు ఆ సర్టిఫికెట్‌ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే కరోనా నెగిటివ్ వచ్చినట్టు సూచించే ఆర్టీపీసీఆర్ రిపోర్టు (ప్రయాణానికి 72 గంటల లోపు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది)ను చూపించిన వారు మాత్రం 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది’’ అని సౌత్ సెంట్రల్ రైల్వే ట్విటర్ వేదికగా వెల్లడించింది.

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కరోనా మహమ్మారి విజృంభించడమే కాకుండా కొత్త వైరస్‌ను డిటెక్ట్ చేశారు. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే తెలంగాణలోని ఓ జిల్లాలో కనుగొన్న వైరస్ కేవలం మూడు రోజుల్లోనే లంగ్స్‌కు ఎఫెక్ట్ అవుతుందని వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై షరతులు విధిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.