ఏపీలో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 161 కేసులు

  • IndiaGlitz, [Saturday,June 06 2020]

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా బీభత్సం సృష్టిస్తోంది. మే నెల మొత్తం తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. అయితే జూన్ ప్రారంభం నుంచి మాత్రం పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గట్లేదు. అయితే అధికారులు మాత్రం ఎక్కువ సంఖ్యలో టెస్ట్‌లు చేస్తున్నారు గనుక కేసులు కూడా అంతేరీతిలో పెరుగుతున్నాయని చెబుతున్నారు. శనివారం నాడు ఒక్కరోజే 161 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది. ఇవాళ నమోదైన కొత్త కేసులతో కలిపితే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3588కు చేరుకుంది. ఇందులో ఇప్పటి వరకూ 2323 మంది డిశ్చార్జి కాగా.. 73 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం 9 గంటల వరకూ రాష్ట్రంలో కరోనాతో ఎవరూ చనిపోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1192గా ఉండగా.. కొత్తగా 29 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు.

ఏపీలో ఇలా ఎందుకు..!?

కాగా.. ఈ మొత్తం కేసుల్లో విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 131 మందికి పాజిటివ్ అని తేలింది. వారిలోలో నలుగురు కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 127 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 741 మందికి పాజిటివ్ అని తేలగా.. వారిలో 467 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ 467 మందిలో 16 మందిని ఇవాళ డిశ్చార్జి చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చి యాక్టివ్‌గా ఉన్న వారి కేసుల సంఖ్య మొత్తం 594. రోజురోజుకూ కరోనా టెస్టులు పెరగడంతో పాటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయని రాష్ట్ర అధికారుల వాదన. మరి ప్రపంచ వ్యా్ప్తంగా, ఇండియాలో.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎప్పుడు తగ్గుతాయో వేచి చూడాలి.

More News

'బొంబాట్‌' రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్ 'స్వామినాథ‌' విడుద‌ల

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా

‘త‌లైవి’ కోసం భారీ ప్రైజ్‌

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న‌ చిత్రం `త‌లైవి`. బాలీవుడ్‌క్వీన్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఒకే సినిమా.. ఇద్ద‌రు ద‌ర్శ‌కులు

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌, ఎఫ్‌2 చిత్రాల‌తో వ‌రుస హిట్స్ త‌న ఖాతాలో వేసుకున్నాడు మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ఇప్పుడు కిర‌ణ్ కొర్ర‌పాటి అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో క‌లిసి బాక్సింగ్ నేప‌థ్యంలో

డిజిట‌ల్ కోసం చేతులు క‌లుపుతున్న నిర్మాత‌లు

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న ప‌రిస్థితులు అంద‌రికీ తెలిసిందే. థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. సినీ పెద్ద‌లు షూటింగ్స్‌ను స్టార్ట్ చేయ‌డానికి ప్ర‌యత్నాలు చేస్తున్నారు.

క్రిష్ మాటలను పవన్ వింటాడా..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వ‌చ్చారు. తొలి చిత్రంగా పింక్ రీమేక్‌గా వ‌కీల్‌సాబ్‌ను సిద్దం చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు.