ఘోర విమాన ప్రమాదం.. 170 మంది దుర్మరణం

  • IndiaGlitz, [Wednesday,January 08 2020]

ఇరాన్‌లో ఇవాళ రెండు ఘోర ఘటనలు జరిగాయి. బుషెహర్ అణు కర్మాగారం సమీపంలో ఇవాళ భూకంపం చోటుచేసుకుంది. రాజధాని టెహ్రాన్ సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 170 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌లైన్స్‌కి చెందిన బోయింగ్ విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖోమైనీ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే ఘోరం జరిగింది. కాగా.. ఈ ప్రమాదానికి కారణం విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడమేనని ఇరాన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. ఈ ఘటనాస్థలిలో విమాన శకలాలు, ఛిద్రమైన మృతదేహాలతో భయానక పరిస్థితిగా మారింది. ప్రమాదంలో మరణించింది 170 మంది కొన్ని మీడియా సంస్థలు వెల్లడించగా.. 180 మంది మృతి చెందారని మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయ్. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

More News

‘జర్నీ’ మూవీలో లాగా ఘోర ప్రమాదం.. 36 మందికి తీవ్రగాయాలు

‘జర్నీ’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదూ.. ఈ సినిమా ఒక్కసారి చూస్తే చాలు కనెక్ట్ అయిపోతుంది.

త్వరలో ప్రసారం కానున్న కొత్త సీరియల్స్‌ని మచిలీపట్నంలో జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో గ్రాండ్‌గా లాంచ్‌ చేసిన జీ తెలుగు

విభిన్నమైన కథ, కథనాలే  ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అలాంటి విభిన్నమైన కంటెంట్‌ను ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందించడంలో అగ్రస్థానంలో ఉంటుంది జీ తెలుగు.

దానయ్యకు హ్యాండిచ్చిన మారుతి!

‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. గత నెల 20న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

మెగా అభిమానులకు పండగలాంటి వార్త!

చిరంజీవి, రామ్ చరణ్.. ఇద్దరూ ఒకే తెరపై కనిపిస్తే.. మెగా అభిమానులకు పండగే పండగ. గతంలో మగధీర, బ్రూస్‌లీ సినిమాల్లో చిరు తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే.

ప్ర‌బాస్ భామ ఫొటో షూట్‌కు ఒళ్లంతా కళ్లు చేసుకోవలసిందేనా.!

అందాల ఆరబోతలో ముందుండే స్కార్లెట్ మెలిష్ విల్సన్.. తాజాగా కళ్లు చెదిరే పిక్స్‌తో కుర్రకారు మతులు పోగొడుతోంది.