ఏపీలో 190కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

  • IndiaGlitz, [Saturday,April 04 2020]

ఆంధ్రప్రదేశ్‌లో గంటగంటకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 164 ఉన్న కేసులు.. శనివారం సాయంత్రానికి 190కు చేరుకుంది. తాజాగా ఏపీలో మరో 10 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా వీటిలో అత్యధికగా కృష్ణా, నెల్లూరు జిల్లాలో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకూ ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.

జిల్లాల వారిగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు:

అనంతపురం-3
చిత్తూరు-10
తూర్పు గోదావరి-11

గుంటూరు-26
కడప- 23
కృష్ణా- 32
కర్నూలు-04

నెల్లూరు-32
ప్రకాశం-19

శ్రీకాకుళం-00

విశాఖపట్నం-15
విజయనగరం-0
పశ్చిమ గోదావరి-15