ఏప్రిల్ లో అన్ని భాషల్లో ఏక కాలంలో విడుదలకి సిధ్ధమవుతున్న '1971 - భారత సరిహద్దు'

  • IndiaGlitz, [Wednesday,March 08 2017]

ప్ర‌తి స‌మ‌స్య‌కి యుధ్ధం స‌మాధానం కాదు. యుధ్ధం లేని ప్ర‌పంచాన్ని చూడాలనుకునే ఓ మేజ‌ర్ క‌థే ఈ 1971 భార‌త‌ స‌రిహ‌ద్దు చిత్రం. 1971 వ సంవ‌త్సరంలో పాకిస్తాన్‌కి, భార‌త‌దేశానికి మ‌ద్య జ‌రిగిన యుధ్ధ నేప‌ద్యంలో ఈ క‌థాంశం న‌డుస్తుంది. అంతేకాదు ఆ యుధ్ధం జ‌రిగిన ప్ర‌దేశంలోనే ఈ చిత్రాన్ని చిత్రీక‌రించ‌టం జ‌రిగింది. రియ‌ల్ గా యుధ్ధ ట్యాంక‌ర్స్ ని వాడి షూట్ చేశారు. బోర్డ‌ర్ లోని ప్ర‌తి సైనికుడు త‌మ క‌ర్త‌వ్యాన్ని దైవంలా భావించి వారి ప్రాణాల‌ను సైతం లెక్క‌పెట్ట‌కుండా దేశ‌ర‌క్ష‌ణ కోసం ఎలా ప‌ని చేస్తార‌నేది ఈ చిత్రంలోని ముఖ్య క‌థాంశం.
ఈ చిత్రాన్నిమ‌ల‌యాళంలో మంచి చిత్రాల ద‌ర్శ‌కుడు, న‌టుడు అంత‌కు మించి మాజి భార‌త సైనికాధికారి మేజ‌ర్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వహించారు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మెహ‌న్‌లాల్ హీరోగా న‌టించారు. మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌లో అల్లు శిరీష్ న‌టించారు. ఈ చిత్రం మొద‌టి లుక్ ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నారు. భార‌త‌దేశంలో అన్ని భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల‌ కానుంది. ప్ర‌తి భార‌తీయుడు చూడ‌వ‌ల‌సిన తెలుసుకోవ‌ల‌సిన చిత్రం ఈ 1971 భార‌త‌ స‌రిహ‌ద్దు.. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ శ్రీనివాస ఆర్ట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై, పూజా కాత్యాయ‌ని నిర్మిస్తున్నారు.
మాట‌లు- ఎం.రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఫోటొగ్రఫి- సుజిత్ వాసుదేవ్‌, ఎడిట‌ర్-సమ్జిత్‌, ఆర్ట్- ప‌లు.కె.జార్జ్ , బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌- గొపి సుంద‌ర్‌, సంగీతం- సిద్దార్ధ విపిన్‌, నాజిమ్ అర్ష‌ద్‌, రాహుల్ సుబ్ర‌మ‌ణ్య‌న్‌, నిర్మాత‌- పూజా కాత్యాయ‌ని, ద‌ర్శ‌క‌త్వం- మేజ‌ర్ ర‌వి

More News

పూరి కోసం సన్నిలియోన్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రోగ్`. జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరీ త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది.

అంకుల్ తో ప్రేమాయణమా?

బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ను అంతా కామ్ గోయింగ్ హీరోయిన్ అంటారు. `ఆషీకీ-2` హీరో ఆదిత్యారాయ్ కపూర్ తో రొమాన్స్ చేసిందని అప్పట్లో ప్రచారం సాగింది గానీ..

'నేనోరకం' ఆడియో ఆవిష్కరణ

రామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మార్చి 9న బాలయ్య-పూరి మూవీ ప్రారంభం

నందమూరి నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న ప్రతిష్టాత్మక 101వ సినిమాకు ముహూర్తం కుదిరింది. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో మార్చి 9న సినిమాను కూకట్ పల్లి తులసి వనం టెంపుల్ లో ప్రారంభోత్సవం జరగనుంది.

జూన్ నుండి మణిరత్నంతో చెర్రీ సినిమా

రామ్చరణ్, ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రామ్ఛరణ్, మణిరత్నంలు ఈ సినిమా గురించి చర్చలు జరిపారు. జూన్ నుండి ఈ క్రేజీ కాంబో మూవీ సెట్స్లోకి వెళ్ళనుంది. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.