2.0 నిర్మాత‌ల కేసు..

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

దాదాపు 450 కోట్ల బ‌డ్డెట్‌తో రూపొందుతోన్న విజువ‌ల్ వండ‌ర్ '2.0'. ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్నారు నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల చేస్తామ‌నుకున్నారు కానీ..కుద‌ర‌క‌పోవ‌డంతో 2018 జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నారు.

కానీ వి.ఎఫ్‌.ఎక్స్ ప‌నుల జాప్యం కార‌ణంగా సినిమా ఆల‌స్య‌మ‌య్యేలా ఉండ‌టంతో సినిమాను ఏప్రిల్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ సినిమా ఏప్రిల్‌లో విడుద‌లైతే చాలా సినిమాపై ఈ ప్ర‌భావం ప‌డుతుంది కాబ‌ట్టి..చాలా మంది నిర్మాతలు ఈ సినిమా ఏప్రిల్ విడుద‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నారు.

ఇది లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాత‌ల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అయితే ఈ స‌మ‌స్య‌ల‌న్నింటికీ కార‌ణం అమెరికాకు చెందిన ఓ వి.ఎఫ్‌.ఎక్స్ సంస్థే. అందువ‌ల్ల నిర్మాత‌లు స‌దరు సంస్థ‌పై కేసు వేశార‌ట‌. కానీ ఏం చేస్తాం. జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయిన‌ట్లేగా.

More News

సాయిధరమ్, కరుణాకరన్ మూవీ అప్ డేట్స్

తాజాగా జవాన్చిత్రంతో పలకరించాడు యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఈ చిత్రంలో సాయిధరమ్ నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఇంటెలిజెంట్ సినిమా చేస్తున్నాడు సాయి.

నాగశౌర్య 'ఛలో' వాయిదా

నాగశౌర్య, రష్మిక మండన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `ఛలో`. తమిళనాడు, ఆంధ్ర బోర్డర్లో రెండు గ్రామాల మధ్య జరిగే ఓ గొడవ నేపథ్యంలో సాగే సినిమా ఇది.

అక్కినేని వారి డబుల్ ట్రీట్

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హలో’. నాగార్జున అక్కినేని నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు.

అప్పుడే 'మామ ఓ చందమామ' పెద్ద హిట్‌ అవుతుందన్న నమ్మకం కలిగింది - ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో రాజశేఖర్‌

యంగ్‌ ఛార్మింగ్‌ హీరో రామ్‌ కార్తీక్‌ హీరోగా సనా మక్బూల్‌ఖాన్‌ హీరోయిన్‌గా శ్రీమతి బొడ్డు శ్రీలక్ష్మీ సమర్పణలో ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్‌టైనర్స్‌ పతాకంపై విశాఖ థ్రిల్లర్‌ వెంకట్‌ దర్శకత్వంలో మురళి సాధనాల కో-ప్రొడ్యూసర్‌గా, వరప్రసాద్‌ బొడ్డు నిర్మించిన ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'మామ ఓ చందమామ'ను మున్నా కాశి సంగీత స

అనూప్ రూబెన్స్ @ 50

జై చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశారు అనూప్ రూబెన్స్‌. ఆ త‌రువాత కొన్ని చిత్రాలు చేసినా.. 2011లో వ‌చ్చిన ప్రేమ‌కావాలితో తొలి బ్రేక్‌ని అందుకున్నారు.