close
Choose your channels

మౌనిక ఫ్యామిలీకి రూ. 20 లక్షలు.. ఒకరికి ఉద్యోగం!

Monday, September 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైదరాబాద్‌లో మెట్రో పిల్లర్ పెచ్చులూడిపడి మౌనిక అనే మహిళ చనిపోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో మెట్రోలో ప్రయాణించాలన్నా.. మెట్రోకు దరిదాపుల్లోకి వెళ్లాలన్నా హైదరాబాదీలు జంకుతున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ఎల్అండ్‌టీ అధికారులు మౌనిక కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ క్రమంలో తమకు 50 లక్షల రూపాయిలు చెల్లించాల్సిందేనని మౌనిక కుటుంబం డిమాండ్ చేయగా.. ఫైనల్‌గా రూ. 20లక్షలు ఇచ్చేందుకు అధికారులు ముందుకొచ్చారు.

అంతేకాదు.. మౌనిక కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వాధికారులు హామీ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన ఈ హామీకి బాధిత కుటుంబం అంగీకరించినట్లు సమాచారం. ఈ ఘటనలో హైదరాబాద్ మెట్రో పిల్లర నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ అండ్ టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మొత్తానికి చూస్తే.. ఈ ఘటనను ఇంతటితో అధికారులు సింపుల్‌గానే మేనేజ్ చేసేశారన్న మాట. మరి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మెట్రో అధికారులు ఎలా చూసుకుంటారో వేచి చూడాలి మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.