close
Choose your channels

తెలంగాణలో తాజాగా 2092 కరోనా కేసులు..

Thursday, August 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను గురువారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 21,346 శాంపిళ్లను పరీక్షించగా.. 2092 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,050కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 13 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం 589 మంది మృతి చెందారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 20358 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 1,289 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 52,103 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా నిన్న జీహెచ్ఎంసీ పరిధిలో 535, మేడ్చెల్-126, రంగారెడ్డి-169, వరంగల్ అర్బన్-128, సంగారెడ్డి-100, నిజామాబాద్-91 కేసులు నమోదు అయ్యాయి. కాగా ఇప్పటి వరకూ తెలంగాణలో 5,43,489 టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.