ప్రజల కోసం 24 గంటలు - నారా లోకేష్


Send us your feedback to audioarticles@vaarta.com


తనను తొలిసారి ఎమ్మెల్యేను చేసిన మంగళగిరి ప్రజల కోసం 24 గంటలూ తన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ప్రకటించారు మంత్రి లోకేష్. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కొన్ని ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని నివశిస్తున్న కొంతమంది ప్రజలకు శాశ్వత నివాస హక్కు కల్పిస్తూ పత్రాలిచ్చారు లోకేశ్.
తాడేపల్లి, ఇప్పటం, పెనుబాక, కొలనుకొండ గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. అలాంటివాళ్లందరికీ మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమం కింద శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలిచ్చారు.
వేదికపైకి రాలేని కొంతమంది దగ్గరకు స్వయంగా లోకేష్ వెళ్లి పట్టాలు అందించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే, మంగళగిరి పేదలకు వాళ్లు ఉన్న చోటునే ఇళ్ల పట్టాలిచ్చేలా జీవో తెచ్చామని అన్నారు లోకేష్.
ఈ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 7వేల మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించి అర్హులైన అందరికీ పట్టాలు అందిస్తామన్నారు లోకేష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com