ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఈఎంఐ చెల్లింపు దారులకు భారీ ఊరట

  • IndiaGlitz, [Friday,March 27 2020]

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ ప్రపంచ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు.. భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడుం బిగించి ముందడుగేసింది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటన చేసిన విషయం విదితమే. అయితే తాజాగా.. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ శుక్రవారం నాడు కీలక ప్రకటన చేశారు. రెపో రేటును ముప్పావు శాతం తగ్గిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇదే సమయంలో రివర్స్ రెపో రేటును ఏకంగా 90 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని.. ఆర్‌బీఐ గవర్నర్‌ స్పష్టం చేశారు. రివర్స్‌ రెపోరేటు 4 శాతానికి చేరిందని.. రుణాల రేటు 4.4శాతానికి చేరిందన్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని.. ప్రస్తుత పరిస్థితుల్ని ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందని శక్తికాంతదాస్‌ మీడియా ముందు వెల్లడించారు. ఆర్థిక స్థిరత్వం కోసం చర్యలు తీసుకుంటామన్నారు.

శుభవార్త ఇదీ..

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండటంతో ఉద్యోగులు, రోజువారీ కూలీలు ఈఎంఐలను కట్టడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ శుభవార్త చెప్పారు. ఈఎంఐలపై 3 నెలల మారిటోరియం అనగా.. మూడు నెలల పాటు కట్టనక్కర్లేదని ఆయన కీలక ప్రకటన చేశారు. కాగా.. ఈ టర్మ్‌లోన్ల ఈఎంఐలపై మార్చి 1 నుంచి 3 నెలల మారిటోరియం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నిజంగా ఇది సామాన్యుడికి శుభవార్తే.. మరీ ముఖ్యంగా ఈఎంఐలు కట్టేవారికి భారీ ఊరట లభించినట్లయ్యింది.

More News

ప‌వ‌న్‌, కేటీఆర్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన సంభాష‌ణ‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌రిగిన సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంత‌కూ వీరిద్ద‌రీ మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఏంటి? ఎందుకు జ‌రిగింది?

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. పరీక్షలు లేకుండానే పై తరగతికి!

కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఏపీలోని జగన్ సర్కార్

కరోనాపై యుద్ధానికి యంగ్ టైగర్ 75 లక్షల విరాళం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో.. టాలీవుడ్ నటీనటులు పలు జాగ్రత్తలు, సలహాలు, సూచనలిస్తూ చైతన్య పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత పెద్ద మనసు చేసుకుని క్లిష్ట పరిస్థితుల్లో తెలుగు

మ‌హేశ్ 27లో మ‌హాన‌టి..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకు సంబంధించిన కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది.

క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌భాస్, మహేష్ బాబు విరాళం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో.. టాలీవుడ్ నటీనటులు పలు జాగ్రత్తలు, సలహాలు, సూచనలిస్తూ చైతన్య పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత పెద్ద మనసు