close
Choose your channels

'ఏమాయ చేసావె', 'ఇష్క్' టైంలోనే..

Thursday, November 14, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నితిన్, నిత్యా మీనన్ జంటగా రూపొందిన 'ఇష్క్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దర్శకుడు విక్రమ్ కుమార్. ఆ సినిమాతో మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ గా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆ పేరే అతనికి మరో తెలుగు సినిమాకి అవకాశమిచ్చేలా చేసింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల నటులతో ఆయన చేస్తున్న ఆ ప్రయత్నం పేరే 'మనం'.

అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆ మధ్య ఏఎన్నార్ బర్త్ డే రోజున విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన లభించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

'మనం'లో శ్రియ, సమంత నాయికలుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరకర్త. ఈ చిత్రం చాలా బాగా షేప్ అప్ అవుతోందని ఇందులో నాయికగా నటిస్తున్న సమంత కూడా విక్రమ్ పై ట్విట్టర్ సాక్షిగాప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రారంభ దశ నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విశేషమేమిటంటే. హిట్ సినిమాలుగా పేరు తెచ్చుకున్న చైతన్య, సమంతల తొలి కాంబినేషన్ సినిమా అయిన 'ఏమాయ చేసావె' (2010).. విక్రమ్ కుమార్ 'ఇష్క్' (2012) కూడా అదే నెలలోనే రిలీజ్ కావడం.

Follow us on Google News and stay updated with the latest!