'కుమ్ముతా' అంటున్న ఎన్టీఆర్

  • IndiaGlitz, [Monday,April 21 2014]
View NTR Gallery

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'రభస' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సమంత, ప్రణీత హీరోయిన్స్. ఈ సినిమా తర్వాత పూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ సినిమా అధికారకంగా అనౌన్స్ మెంట్ రానుందట. సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూలై నుండి ప్రారంభం కానుందట.

ఈ సినిమాని ఆగ్రనిర్మాతగా కొనసాగుతున్న బండ్లగణేష్ రూపొందిస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్ తో 'బాద్ షా' అనే బ్లాక్ బస్టర్ అనే సినిమాని నిర్మించిన బండ్లగణేష్ మరో సినిమాని నిర్మించనున్నాడు. తాజా వివరాల ప్రకారం ఈ సినిమాకి 'కుమ్మేస్తా', 'కుమ్ముతా' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని సమచారం. ఆంధ్రావాలా తర్వాత పూరిజగన్నాథ్, ఎన్టీఆర్ కాంభినేషన్ లో వస్తున్న సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.