'నువ్వే నా బంగారం' పాటలు విడుదల....

  • IndiaGlitz, [Saturday,November 30 2013]

శ్రీ ధనలక్ష్మి మూవీస్ బ్యానర్ లో నిర్మితమవుతున్న సినిమా 'నువ్వే నా బంగారం'. సాయికృష్ణ , షీనా హీరోహీరోయిన్లు. పేరిచర్ల కృష్ణంరాజు నిర్మాత. రామ్ వెంకీ దర్శకుడు. ఈ సినిమా ఆడియో శుక్రవారం హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో జరిగింది. ఆడియో సీడీలను దాసరి విడుదల చేసి వినాయక్ కి అందించారు. సాగర్ ట్రైలర్స్ ని ఆవిష్కరించారు. యాజమాన్య సంగీతం అందించారు. ఈసందర్భంగా ...

దర్శకుడు రామ్ వెంకీ మాట్లాడుతూ 'ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్, యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.యాజమాన్య సంగీతం సినిమా బాగా హెల్ప అవుతుంది. నా కంటే సినిమా మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించారు. అందరికీ సినిమా నచ్చుతుంది' అని అన్నారు.

నిర్మాత కృష్ణంరాజు మాట్లాడుతూ 'దాసరిగారు, వినాయక్ గారు ఈ ఫంక్షన్ కి రావడం మా అదృష్టం. వినాయక్ గారు సీడీ అందుకున్న సినిమాలన్నీ హిట్టయ్యాయి. మా చిత్రం కూడా హిట్ అవుతుంది.సంగీత దర్శకుడు మంచి సంగీతానందించారు. పాటలు అద్బుతంగా వచ్చాయి. ఈ సినిమాని ప్రేక్షకులు సైతం అదరించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

దాసరి నారాయణ రావు మాట్లాడుతూ 'పాటలు విన్నాను . బాగా ఉన్నాయి. సంగీతం బాగా ఉంది. ఇవాళ ఇండస్ర్టీకి చాలా మంది యూత్ హీరోలుగా, ఆర్టిస్ట్ లుగా వస్తున్నారు. చాలా మంచి చిత్రాలు వస్తున్నాయి. కానీ మంచి ప్రమోషన్ లేకుండా వెనుకబడుతున్నాయి. ప్రతి ఒక్కరికి బిడ్డల కంటే తమ మనవడు, మనవరాలంటే చాలా ఇష్టంగా ఉంటారు.