'మనం' సంగీత విజయోత్సవం..

  • IndiaGlitz, [Friday,May 16 2014]
View 'Manam' Sangeetham Celebrations Gallery

శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో అక్కినేని ఫ్యామిలీ నిర్మించిన చిత్రం మనం. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ ఎడెకరాల్లో సంగీత విజయోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ మొఘల్ డి.రామానాయుడు, డి.సురేష్ బాబు, వి.బి.రాజేంద్రప్రసాద్, నితిన్, రమేష్ ప్రసాద్ తదితరులతో పాటు అక్కినేని కుటంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

నాగార్జున మాట్లాడుతూ 'మనం నాన్నగారితో చేస్తున్న చివరిచిత్రం. ఆయనతో నటిస్తున్నప్పుడు ఎంత థ్రిల్ ఫీలయ్యానో చెప్పలేను. ఆయన గొప్ప నాన్నగానే కాకుండా లెజెండ్రీ యాక్టర్ గా తెలుగు ప్రేక్షకులు గుండెల్లో నిలిచిపోయారు. ఆయన మన మద్య లేకపోయినా అయన చేసిన పాత్రలు మనందరికి గుర్తుండిపోతాయి. ఆయనతో గడిపిన ప్రతి మూమెంట్ మరచిపోలేనిది. అనూప్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చాడు. తనకి థాంక్స్' అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ 'ఇది నా 25వ సినిమా. అక్కినేని నాగేశ్వరరావుగారి సినిమాకి నేను సంగీతం అందించడం అదృష్టంగా ఫీలవుతున్నాను. ఇదొక రేర్ మూవీ. ఈ మ్యూజిక్ కి మరింత ఆదరణ లభిస్తుందని నమ్మకం ఉంది' అన్నారు.

Watch Manam Trailers