close
Choose your channels

'మీకు మాత్రమే చెప్తా'..3 రోజుల్లోనే 4.05 కోట్ల గ్రాస్

Monday, November 4, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన తొలి చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా" ఈ నెల 1న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో నవ్వులు పంచుతోంది. అంచనాలకు తగ్గట్టుగానే డీసెంట్ వసూళ్ల సాధించింది.ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే 4 కోట్ల 05 లక్షల గ్రాస్ కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది.

కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూనే తన అభిరుచి మేరకు విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా టార్గెటెడ్ ఆడియన్స్ కు డబుల్ ట్రీట్ గా మారింది. ఓ చిన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ సాధించడమే అందుకు నిదర్శనం. ఇక హీరోగా నటించిన తరుణ్ భాస్కర్ తో పాటు ప్రధాన పాత్రధారులైన అభినవ్ గోమటం, అవంతికా మిశ్రా, పావని గంగిరెడ్డి, అనసూయ, నవీన్ జార్జ్ థామస్ ల నటన, టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారడంతో రాబోయే రోజుల్లో మరింత పెద్ద విజయంగా ఈ సినిమా నిలవబోతోందని చెప్పొచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.