close
Choose your channels

గంగూలీ ఇంట కరోనా కల్లోలం.. నలుగురికి పాజిటివ్

Sunday, June 21, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గంగూలీ ఇంట కరోనా కల్లోలం.. నలుగురికి పాజిటివ్

బీసీసీఐ చీఫ్ గంగూలీ ఇంట్లో కరోనా కల్లోలం రేపింది. ఆయన కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గంగూలీ పెద్దన్నయ్య స్నేహాశిష్ భార్య, ఆమె కుటుంబ సభ్యులకు వైరస్ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. వీరితో పాటు వీరింట్లో పని చేసే వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు తేలింది.

అయితే గంగూలీ ఫ్యామిలీ ఆయన అన్న ఫ్యామిలీ వేర్వేరు ఇంట్లో ఉంటున్నట్టు గుర్తించారు. కాబట్టి గంగూలీకి కరోనా సోకే అవకాశం లేకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చకున్నారు. ప్రస్తుతం పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గంగూలీ కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.