close
Choose your channels

ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు.. 101 మంది డిశ్చార్జ్

Saturday, May 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు.. 101 మంది డిశ్చార్జ్

ఆంధ్రప్రదేశ్‌ కరోనా థాటి నుంచి కాస్త కోలుకున్నట్లే అనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే.. వారంరోజులుగా నమోదైన కేసులు చాలా కుదుటపడుతోందనే చెప్పుకోవచ్చు. ఇదివరకు 70,80,90 కేసులు నమోదవ్వగా ఇప్పుడు మాత్రం 50 లోపే కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు డిశ్చార్జ్ సంఖ్య కూడా మెరుగ్గానే ఉంది. కాగా.. గడిచిన 24 గంటలుగా కొత్తగా ఏపీలో 48 మందికి కరోనా సోకినట్లు మీడియా బులెటిన్ నం. 156లో ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో కలిపితే మొత్తం కేసుల సంఖ్య 2,205కు చేరుకుంది. చిత్తూరులో 8, గుంటూరులో 9, కడపలో 1, కృష్ణా జిల్లాలో 7, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 9, విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

9,628 శాంపిల్స్‌ పరీక్షించగా..

గడిచిన 24 గంటల్లో 101 మంది డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటి వరకూ మొత్తం 1,353 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో 803 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. తాజాగా కరోనాతో ఒకరు మృతి చెందగా.. ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 49కి చేరుకుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకూ 9,628 శాంపిల్స్‌ను పరీక్షించగా 48 మందికి మాత్రమే కరోనా ఉన్నట్లు తేలింది. కర్నూలు జిల్లా 608 కేసులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత గుంటూరు 413, కృష్ణా 367 కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసులన్నీ జిల్లాల వ్యాప్తంగా సింగిల్ డిజిట్‌లోనే నమోదయ్యాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.