విజయనగరంలో రెండు బస్సులు, లారీ ఢీ.. ఐదుగురి మృతి

  • IndiaGlitz, [Monday,March 29 2021]

అతివేగంతో పాటు.. డంపింగ్ యార్డులో చెత్త తగులబెట్టడం వెరసి పెను ప్రమాదానికి కారణమయ్యాయి. డంపింగ్ యార్డును తగులబెట్టడంతో ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. అలాంటి చోట ఎంత జాగ్రత్తగా రావాలి. కానీ లారీ, బస్సు వేగం మాత్రం తగ్గించలేదు. దీంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. అదే సమయంలో అటుగా వచ్చిన మరో ఆర్టీసీ బస్సు సైతం వెనుక నుంచి ముందున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతమంతా క్షణాల్లో భయానకంగా మారిపోయింది.

అసలు విషయంలోకి వెళితే.. విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అదే సమయంలో వైజాగ్ వైపు నుంచి విజయనగరం వస్తున్న మరో ఆర్టీసీ బస్సు.. ముందున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఘటనలో 32 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108కు సమాచారం అందించి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉండటంతో చెత్తను తగులబెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోగా.. అతి వేగం కూడా ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. లారీ, మరో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో పరిస్థితి భయానకంగా మారింది. మధ్యలో ఉన్న బస్సుతో పాటు వెనుక నుంచి ఢీకొట్టిన బస్సు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

More News

పవన్ ఫ్యాన్స్‌కి బంపరాఫర్.. ట్రైలర్ రిలీజ్ వారి చేతుల మీదుగానే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈసారి పవన్ తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

`హిట్ 2` వ‌దులుకోడానికి కార‌ణం చెప్పిన విష్వ‌క్ సేన్‌

యువ క‌థానాయ‌కుల్లో విష్వ‌క్ సేన్ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

మూడు రోజుల్లో ‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సర్‌ప్రైజ్!

దర్శకధీరుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.

ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పిన సింగర్ సునీత

టాలీవుడ్‌లో సింగర్‌ సునీతకు అభిమాన గణం ఎక్కువే.  టీవీ యాంకర్‌గా, సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు.

18 ఏళ్లుగా నాతో కలిసున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’ విడుదలై నేటికి 18 ఏళ్లు. ఈ విషయాన్ని గుర్తు చేస్తే బన్నీ ఓ ట్వీట్ చేశాడు.