మహేష్ దూకుడుకు ఐదేళ్లు..!

  • IndiaGlitz, [Friday,September 23 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - శ్రీను వైట్ల కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం దూకుడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో మ‌హేష్ కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచిన దూకుడు చిత్రం రిలీజై నేటికి స‌రిగ్గా ఐదేళ్లు పూర్త‌య్యింది. సిన్సియ‌ర్ పోలీస్ గా మ‌హేష్ న‌ట‌న‌, బ్ర‌హ్మి, ఎం.ఎస్.నారాయ‌ణ ల కామెడీ, శ్రీను వైట్ల టేకింగ్, త‌మ‌న్ సంగీతం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక్ట‌టుకుంది. ముఖ్యంగా తండ్రి కోసం లేని ప్ర‌పంచాన్ని సృష్టించిన త‌న‌యుడుగా మ‌హేష్ అద్భుతంగా న‌టించి అంద‌రి మ‌న‌సులు దోచుకున్నాడు.
ఇక ఈ సినిమాలో న‌టించ‌క‌పోయినా...సినిమా విజ‌యానికి ఒక కార‌ణంగా నిలిచారో స్టార్..! ఆయ‌నే టాలీవుడ్ కింగ్ నాగార్జున‌. ఈ మూవీలో రియాలిటి షో సృష్టిక‌ర్త‌, మాటీవీ ఓన‌ర్ నాగార్జున కోసం అంటూ ఓ రియాలిటీ షో ఎపిసోడ్ క్రియేట్ చేసారు. దీనిని ఆడియోన్స్ బాగా ఎంజాయ్ చేసారు. ఇలా అన్ని అంశాలు ఈ మూవీకి బాగా కుద‌ర‌డంతో దూకుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం సంచ‌ల‌నం సృష్టించింది. మ‌హేష్ లోని ఓ కొత్త‌కోణాన్ని ఆవిష్క‌రించిన దూకుడు చిత్రం రిలీజై నేటికి ఐదేళ్లు పూర్తైంది. ఈ సంద‌ర్భంగా 14 రీల్స్ సంస్థ రామ్ న‌టించిన హైప‌ర్ ఆడియోను ఈరోజు రిలీజ్ చేస్తుండ‌డం విశేషం..!

More News

బోయపాటి శ్రీను - బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమా ప్రారంభం..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాని తెరకెక్కించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను

మ‌జ్నులో అలా చేయ‌డం నాకు కిక్ ఇచ్చింది - నాని

భ‌లేభలేమ‌గాడివోయ్,కృష్ణగాడివీరప్రేమగాధ‌,జెంటిల్మ న్...చిత్రాల‌తో హ్యాట్రిక్సా ధించిన యువ హీరో నాని. విభిన్న క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న నాని తాజా చిత్రం మ‌జ్ను.

మెగాస్టార్ 38 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ‌..!

తెలుగు సినీ ప్ర‌పంచంలో పునాదిరాళ్లు సినిమాతో ప్ర‌వేశించి... చిరు పాత్ర‌లు పోషించే స్ధాయి నుంచి చిరంజీవిగా ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు

ఎమ్‌.ఎమ్‌. మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఓషో తులసీరామ్‌ నూతన చిత్రం

మంత్ర, మంగళ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఓషో తులసీరామ్‌. త్వరలో ఓ విభిన్న చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని ఎమ్‌.ఎమ్‌. మూవీ మేకర్స్  సంస్థ నిర్మించ‌నుంది.

అల్లు అర్జున్‌, లింగుస్వామి, జ్ఞాన‌వేల్ రాజా కాంబినేష‌న్లో ద్విభాషా చిత్రం

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, తెలుగు, త‌మిళం లో తిరుగులేని స్టైలిష్ మేక‌ర్ గా గుర్తింపుపొందిన జ్ఙాన‌వేల్ రాజా నిర్మాత‌గా, సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో స్టూడియోగ్రీన్ ప్రొడ‌క్ష‌న్‌-12 గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపోందుతున్న చిత్ర వివ‌రాలు ఈ రోజు చెన్నై  మీడియా మీట్ లో తెలిపారు.