దేశంలో విజృంభిస్తున్న కరోనా.. నేడు దాదాపు 55 వేల కేసులు

  • IndiaGlitz, [Sunday,August 02 2020]

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఐదు రోజులుగా 50 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ కేసుల సంఖ్య 17 లక్షలు దాటేసింది. కరోనా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. 24 గంటల్లో 54,736 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ కేసుల సంఖ్య 17,50,724కు చేరుకుంది. 

గడచిన 24 గంటల్లో 853 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. ఇప్పటి వరకూ కరోనాతో 37,364  మంది మృతి చెందారు. కాగా 11,45,629 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం దేశంలో 5,67,730 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 65.4 శాతం, మరణాల రేటు 21.3శాతం నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.