ఏడేళ్ల 'బృందావనం'

  • IndiaGlitz, [Saturday,October 14 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ని కొత్త‌గా ప్ర‌జెంట్ చేసిన చిత్రాల్లో బృందావ‌నం ఒక‌టి. జోవియ‌ల్‌గా, పాజిటివ్ ఆటిట్యూడ్‌తో ఉండే క్రిష్ పాత్ర‌లో తార‌క్ ఒదిగిపోయాడు. అదుర్స్ వంటి విజ‌య‌వంతమైన చిత్రం త‌రువాత అదే సంవ‌త్స‌రంలో వ‌చ్చిన బృందావ‌నం కూడా మంచి విజ‌యం సాధించింది. ఫ్యామిలీ ఒరియెంటెడ్ స‌బ్జెక్ట్‌తో తెర‌కెక్కిన ఓ ఫుల్‌ప్లెడ్జెడ్ మూవీలో ఎన్టీఆర్ న‌టించిన తొలి చిత్ర‌మిదే కావ‌డం గ‌మ‌నార్హం. నిర్మాత దిల్ రాజుతోనూ.. ద‌ర్శ‌కుడు వంశీ పైడి ప‌ల్లి తోనూ.. క‌థానాయిక‌లు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, స‌మంత తోనూ.. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్‌తోనూ ఎన్టీఆర్ చేసిన మొద‌టి చిత్రమిదే కావ‌డం విశేషం.

ప్ర‌కాష్ రాజ్‌, శ్రీ‌హ‌రి, కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మానందం, ముఖేష్ రుషి, ప్ర‌గ‌తి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు ఛాయాగ్ర‌హ‌ణం అందించారు. క‌న్న‌డ‌లో బృందావ‌న‌, ఒడియాలో ల‌వ్ మాస్ట‌ర్‌, బెంగాలీలో ఖోఖా 420, మ‌రాఠిలో వృందావ‌న్‌ పేర్ల‌తో ఈ సినిమా రీమేక్ అయ్యింది. 2010లో అక్టోబ‌ర్ 14న విడుద‌లైన బృందావ‌నం నేటితో 7 ఏళ్ల‌ను పూర్తిచేసుకుంటోంది.

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న నెక్ట్స్ నువ్వే

ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి ట్రైల‌ర్ ఇటీవ‌లే విడ‌దల‌య్యి మంచి స్పంద‌న పొంద

రీమేక్‌లో సంజ‌య్‌ దత్...

బాలీవుడ్ స్టార్ సంజ‌య్‌ద‌త్ ఓ హిందీలో రీమేక్ కానున్న త‌మిళ చిత్రంలో కీల‌క‌పాత్ర పోషించ‌నున్నాడు. వివ‌రాల్లోకెళ్తే..పిజ్జా ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జిగ‌ర్ తండా(తెలుగులోచిక్క‌డు దొర‌క‌డుగా విడుద‌లైంది) సినిమా ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ &#

'శివ‌కాశీపురం' మొద‌టి పాట విడుద‌ల‌

సంగీత ద‌ర్శ‌కులు చ‌క్ర‌వ‌ర్తి మ‌న‌వ‌డు రాజేశ్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సాయి హ‌రేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ పై హ‌రీష్ వ‌ట్టి కూటి ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న చిత్రం 'శివ‌కాశీపురం'.

నా హృద‌యానికి ద‌గ్గ‌రైన సినిమా 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ' - హీరో రామ్‌

ఎన‌ర్జిటిక్ రామ్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. స్రవంతి రవికిషోర్‌, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

400 కిలోల బంగారంతో...

సంజయ్ లీలా బన్సాలీ మూవీ మేకింగ్ అంటే..గ్రాండియర్గా ఉంటుంది. ఆ విషయం ఆయన సినిమాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం 'పద్మావతి'.