‘పీవీ సింధును కిడ్నాప్ చేసి పెళ్లాడుతా..’

  • IndiaGlitz, [Tuesday,September 17 2019]

‘పీవీ సింధును కిడ్నాప్ చేసి పెళ్లాడుతా..’ అని టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే. అంతే కాదండోయ్ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. పండు ముసలోడు.!. అన్నీ అయిపోయిన వయస్సులో తాతకు ఈ వింత కోరిక పుట్టింది. ఓ లేఖ రూపంలో ఆ ముదుసలి తాత తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఇవన్నీ అటుంచితే.. ఆ తాత బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు వీరాభిమాని. ఇలా పెళ్లి చేసుకుంటానని కలెక్టర్‌కు ఆయన లేఖ రాశాడు. ఇంతకీ ఆయనెవరు..? ఎందుకీ వింత కోరిక పుట్టింది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

నవ్వుకున్న జనాలు!

ఇదిగో ఈ ఫొటోలోని వ్యక్తి తమిళనాడులోని రామనాథపురంకు చెందినవారు. జిల్లా కలెక్టర్ వీర రాఘవరావు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ జరుగుతుండగా.. ఓ వృద్ధుడు వచ్చి సింధుతో పెళ్లి చేయాలని అర్జీ పెట్టుకున్నాడు. అయితే ఈ లేఖ చూసిన కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పడిపడి నవ్వుకున్నారట.. మరికొందరు షాకయ్యారు. అంతేకాదు కొంతమంది దాన్ని ఫొటోతీసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

లేఖలో ఏముంది..!?

‘నా పేరు మలచమి. నేను 2004లో జన్మించాను. నేను ఈ భూమ్మీద ఉన్న దుష్టశక్తులను నాశనం చేయడం కోసం నేను అవతారంగా పుట్టాను. నా వయస్సు ప్రస్తుతం 16 ఏళ్లు. నాలాంటి వ్యక్తులు యుక్త వయస్సులో, అందంగా ఉండే పీవీ సింధూలాంటి క్రీడాకారిణిని పెళ్లి చేసుకోవాలి. అందుకే.. నేను సింధును కిడ్నాప్ చేయబోతున్నా.. ఈ పని చేయడానికి కలెక్టర్ సహకారం కావాలి’ అని మలచమి లేఖలో రాసుకొచ్చారు. ఫిర్యాదులో సింధు, మలచమి ఫొటోలు అతికించాడు.

సింధు స్పందిస్తుందా!?

ఇదిలా ఉంటే.. ఇది వినడానికి కాస్త నవ్వుకున్నా ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో మరి. అయితే దీనిపై సింధు ఎలా రియాక్ట్ అవుతుందో లేకుంటే అబ్బే దీనికి రియాక్షన్ అవసరమా..? అని మిన్నకుండిపోతుందా..? కనీసం మీడియా ముందు కాకుండా సోషల్ మీడియా ద్వారా అయినా స్పందిస్తుందేమో వేచి చూడాల్సిందే మరి.

More News

పోలవరం తర్వాత జగన్ మరో షాకింగ్ నిర్ణయం!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకుని ఇప్పటివరకూ అన్ని సంచలన, కీలక నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఇందుకు ఆయన వందరోజుల పాలనే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.

టీటీడీ పాలకమండలి సభ్యులు ఖరారు.. జగన్ సమన్యాయం!

టీటీడీ చైర్మన్‌గా వైసీపీ సీనియర్, వైఎస్ జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పాలకమండలి సభ్యులను పెండింగ్‌లో పెట్టిన సర్కార్.. మంగళవారం నాడు

నిర్మాత పివిపి అకౌంట్‌లో గోల్ మాల్‌.. మేనేజ‌ర్‌పై కేసు న‌మోదు ?

ప్ర‌ముఖ సినీ నిర్మాత పి.వి.పి బ్యాంకు ఖాతా నుండి ప‌ది కోట్ల రూపాయ‌లు గ‌ల్లంతైన‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. పి.వి.పి ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్‌గా చెప్పుకునే భాను ప్ర‌కాశ్ అనే వ్య‌క్తే ఈ మొత్తాన్ని

మోదీ బ‌యోపిక్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. ప‌లు రంగాల్లోని కీల‌క వ్య‌క్తుల జీవిత చ‌రిత్ర‌ల‌ను వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఆ కోవ‌లో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంది. అ

కోడెల మృతిపై చంద్రబాబు, బాలయ్య ఆవేదన!

టీడీపీ కీలకనేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.