బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం

  • IndiaGlitz, [Tuesday,February 23 2021]

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 10 మందితో కూడిన బ్యాండ్ బృందం మంగళవారం ఉదయం ప్యాసింజర్ ట్రక్‌లో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ట్రక్, ఎస్‌యూవీ కారు ఢీకొన్న ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు.

బిహార్‌లోని కటిహార్ జిల్లాలోని కుర్షేలా సమీపంలోని 31వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కటిహార్ ఎస్‌డీపీవో అమర్‌కాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాండ్ బృందానికి చెందిన పదిమంది సభ్యులు పూర్నియా నుంచి ప్యాసింజర్ ట్రక్‌లో బయలుదేరారు. ఆటో కుర్షేలా సమీపంలోని 31వ జాతీయ రహదారిపైకి రాగానే.. ఎదురుగా వస్తున్న ఎస్‌యూవీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఒకరు.. నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ట్రక్కును సీజ్ చేయగా.. కారు డ్రైవర్ పరారైనట్టు అమర్‌కాంత్ తెలిపారు. మృతుల్లో ఐదుగురిని గుర్తించారు. వారంతా మజ్‌దిహా గ్రామానికి చెందిన సుశీల్ కుమార్ మోచి(30), అర్జున్ మోచి(50), కిశోర్ పాశ్వాన్(45), చోటేలాల్‌ రామ్(42), ధర్మేంద్ర కుమార్ మండాల్(50) ఉన్నారు. వీరి మృతితో స్వగ్రామమైన మజ్‌దిహాలో తీవ్ర విషాదం నెలకొంది.

More News

రెండు వారాలు వెయిటింగ్‌లో పెట్టిన బ‌న్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం పుష్ప‌. ఇప్ప‌టికే మారేడుమిల్లి, రంప‌చోడ‌వ‌రం ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్

కేజిన్నర బంగారంతో వెళుతుండగా ప్రమాదం.. ఇద్దరి మృతి

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మాల్యాలపల్లి రైల్వేబ్రిడ్జ్ మూల మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

హాలీవుడ్ ద‌ర్శ‌కుడితో యంగ్ టైగ‌ర్‌..?

కొన్ని వార్త‌లు నిజ‌మైతే బాగుంటుంది.. అని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుకుంటారు. ఇప్పుడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా అలాగే అనుకుంటున్నార‌ట‌.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం స్టార్ రైట‌ర్ క‌థ‌..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ సినిమాలో బాలీవుడ్ స్టార్‌..?

మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.