హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో 8 సింహాలకు కరోనా లక్షణాలు!

  • IndiaGlitz, [Tuesday,May 04 2021]

దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో కరోనా విలయం సృష్టిస్తోంది. ఇక తెలంగాణలో మనుషులకే కాదు.. జంతువులకు సైతం కరోనా సోకినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్కులో 8 సింహాలకు కరోనా లక్షణాలున్నట్టు జూ అధికారులు గుర్తించారు. సింహాల నుంచి శాంపిల్స్ సేకరించి వాటిని జూ అధికారులు పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. జూపార్క్‌లో సందర్శకులకు అనుమతిని నిరాకరించారు. సీసీఎంబీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

ఈ 8 సింహాల రిపోర్ట్స్ ఇవాళ(మంగళవారం) వచ్చే అవకాశం ఉంది. నివేదికలో ఏం వస్తుందోనని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. సెకండ్ వేవ్ లో జంతువులకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ 8 సింహాలకూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే మిగిలిన జంతువులతో పాటు అక్కడ పని చేసే సిబ్బంది పరిస్థితి ఏంటని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు పార్కులను మూసివేశారు. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి జూ పార్కులో సందర్శకులకు జూ అధికారులు అనుమతి నిరాకరించారు.

కాగా.. తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 59 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 2,476కు చేరుకుంది. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,63,361కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 79,520 యాక్టివ్ కేసులుండగా.. 3,81,365 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,029, మేడ్చల్‌ 507, నల్గొండ 402, రంగారెడ్డి 387 కేసులు నమోదయ్యాయి.

More News

స్పీకర్ తమ్మినేని దంపతులకు సీరియస్!

కరోనా సెకండ్ వేవ్ ఊహకందని రీతిలో వ్యాపిస్తోంది. రోజుకు దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా..

ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేసేందుకు సిద్ధమైన ‘కేజీఎఫ్’ బ్యూటీ

‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న చిత్రం ‘సలార్’.

తమిళ స్టార్ హీరోతో వంశీ పైడిపల్లి నెక్ట్స్ సినిమా..

‘ఊపిరి’, ‘మహర్షి’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వంశీ పైడిపల్లి.

ఈ మొక్కలు ఇంట్లో ఉన్నాయంటే.. ఆక్సిజన్‌కు కొదవుండదు..

ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ఎంత అవసరమనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి కారణంగా పెద్ద ఎత్తున జనం కరోనా బారిన పడుతున్నారు.

అటు పవర్ స్టార్.. ఇటు సూపర్ స్టార్‌తో నిధి..

ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకుంటోంది. ఇప్పటికే గల్లా అశోక్ డెబ్యూ మూవీతో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’