close
Choose your channels

9 మందిని పొట్టనబెట్టుకున్న శానిటైజర్..

Friday, July 31, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ లాక్‌డౌన్ విధిస్తున్నారు. దీంతో మద్యం దుకాణాలు కూడా బంద్ అవుతున్నాయి. మద్యానికి బానిసైన పలువురు మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో మద్యం తాగకుండా ఉండలేక శానిటైజర్‌ను తాగేస్తున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో ఇదే ఘటన జరిగింది. కరోనా కారణంగా మద్యం దుకాణాలు మూసి ఉండటంతో పలువురు యాచకులు శానిటైజర్ తాగేశారు. దీంతో ఇప్పటి వరకూ తొమ్మిది మంది మృతి చెందారు.

మృతుల్లో అనుగొండ శ్రీను బోయ(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60) , కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65) తో పాటు మరో ముగ్గురు యాచకులున్నారు. మద్యం దొరక్క శానిటైజర్ తాగిన వారిలో గత రాత్రి ముగ్గురు మృతి చెందగా.. చికిత్స పొందుతూ నేడు మరో ఆరుగురు మృతి చెందారు. అయితే వీరంతా మద్యం షాపులు మూసివేయడంతో శానిటైజర్ తాగినట్లు భావిస్తున్న పోలీసులు.. మరోవైపు కల్తీ మద్యం లేదం కల్లు ఏమైనా తీసుకుని ఉంటారా.. అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.