Kavitha:కవితకు భారీ షాక్.. వారం రోజుల రిమాండ్ విధించిన కోర్టు..

  • IndiaGlitz, [Saturday,March 16 2024]

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరగా వారం రోజులు మాత్రమే న్యాయమూర్తి ఇచ్చారు. తిరిగి మార్చి 23 మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. దీంతో ఏడు రోజుల పాటు ఈడీ హెడ్ క్వార్టర్స్‌లోనే కవిత విచారణ జరగనుంది. కస్టడీ సమయంలో కవితకు ఇంటి నుంచి బట్టలు, భోజనం అందించేందుకు.. కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులు కలిసేందుకు కూడా అనుమతించింది.

కాగా లిక్కర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించన సంగతి తెలిసిందే. నాలుగు గంటల పాటు సోదాల అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని రాత్రికి రాత్రే ఢిల్లీకి తరలించిచారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల తర్వాత రౌస్ ఎవెన్యూ సెషన్స్ కోర్టులో హాజరుపర్చారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి.. ఈడీ తరఫున ఎన్‌.కె మట్టా, జోయబ్‌ హుసేన్‌ వాదించారు.

ముందుగా కవిత తరపున న్యాయవాది వాదిస్తూ అధికార దుర్వినియోగంతో కవితను ఈడీ అరెస్ట్ చేసిందని ఆరోపించారు. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారని.. మహిళను ఈడీ కోర్టుకు పిలవడంపై కేసు పెండింగ్‌లో ఉంది గుర్తు చేశారు. తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోమని.. ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు ఈడీ కట్టుబడి లేదన్నారు. మార్చి 15న జరిగిన సుప్రీంకోర్టు విచారణలో ఈడీ తరపున ఏఎస్పీ రాజు సెప్టెంబర్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్ విత్ డ్రా చేసుకుంటున్నామని చెప్పారన్నారు. అనంతరం ఈ కేసును 19కి వాయిదా వేశారని తెలిపారు. అయినప్పటికీ ఈడీ అధికారులు హైదరాబాదులో కవిత ఇంటికి సోదాల పేరుతో వెళ్లి అరెస్ట్ చేశారని.. ఇది అక్రమ అరెస్ట్ అని వాదనలు వినిపించారు.

ఇక ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కవితను చట్టబద్దంగానే అరెస్ట్ చేశామని తెలిపారు. ఇండో స్పిరిట్ ద్వారా కవిత లిక్కర్ స్కాం చేశారని.. బుచ్చి బాబు, మాగుంట మధ్య వాట్సాప్ చాట్‌లో కవిత పాత్ర బయట పడిందన్నారు. మేడంకు 33 శాతం అని చాట్‌లో ఉందని పేర్కొన్నారు. ఆ చాట్‌లో ఉన్న మేడం కవితే అని మాగుంట రాఘవ, బుచ్చిబాబును విచారిస్తే అంగీకరించారని కోర్టుకు విన్నవించారు. నేరం చేసి అక్రమ సొమ్ము సంపాదించారని దర్యాప్తులో తేలిందన్నారు. సోదాల సమయంలో కవిత సోదరుడినని చెప్పి 20 మంది లోపలికి వచ్చి గందరగోళం సృష్టించారని వాదించారు. సెక్షన్ 19 ప్రకారమే తాము ముందుకి వెళ్లామన్నారు. ఇది ఎలాంటి కోర్టు ధిక్కారం కాదన్నారు. కఠిన చర్యలు తీసుకోబోమని తాము ఎలాంటి అండర్‌ టేకింగ్‌ ఇవ్వలేదని.. పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి నిర్ణయానికి రావద్దని చెప్పకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వారం రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

More News

YCP:వైసీపీ అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట.. సామాజిక న్యాయం అంటే ఇదే..

వైనాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్న వైసీపీ అందుకు తగ్గట్లే అభ్యర్థులను ఎంపిక చేసింది.

RS Praveen Kumar :బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా.. బీఆర్ఎస్‌లోకి..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షడు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Modi:కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో తెలంగాణ నలిగిపోతుంది.. ప్రధాని మోదీ విమర్శలు..

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య తెలంగాణ నలిగిపోతుందని ప్రధాని మోదీ వాపోయారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు.

Venkatesh Daughter:కుటుంబసభ్యుల సమక్షంలో సింపుల్‌గా వెంకటేష్ చిన్న కుమార్తె వివాహం..

దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. విక్టరీ వెంకటేష్ చిన్న కుమార్తె వివాహం శుక్రవారం రాత్రి సింపుల్‌గా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది.

Mudragada: కాపుల్లో చెరగని 'ముద్ర'గడ.. వైసీపీలో చేరికతో విపక్షాల్లో అలజడి..

దశాబ్దాలకు కాపులకు పెద్దగా వ్యవహరిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కోసం సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. ఇందుకోసం అప్పటి తెలుగుదేశం