కళాతపస్వికి అరుదైన గౌరవం...

  • IndiaGlitz, [Tuesday,May 02 2017]

క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్, మే 3న ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ చేతుల మీదుగా అవార్డు స్వీక‌రించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ అవార్డు స్వీక‌రించిన అనంతం వేదిక‌పై కె.విశ్వ‌నాథ్ ప్ర‌సంగించ‌నున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 1969 నుండి ప్ర‌ధానం చేస్తున్నారు. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ అవార్డు స్వీక‌ర్త వేదిక‌పై ప్ర‌సంగించ లేదు. ఇలాంటి అరుదైన గౌర‌వం క‌ళాత‌ప‌స్వికి ద‌క్కనుంది. కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖామంత్రి ఎం.వెంక‌య్య‌నాయుడు చొర‌వ‌తో క‌ళాత‌ప‌స్వికి వేదిక‌పై ప్ర‌సంగించ‌బోతున్నారు. యాభై ఏళ్ళ సినీ ప్ర‌స్థానంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చేసిన కృషిపై ఆయ‌న మాట్లాడబోతార‌ట‌.

More News

స్సెషల్ సాంగ్ లో శ్రియ...

మూడు పదులు వయసు దాటినా నటి శ్రియ మాత్రం వరుస అవకాశాలతో బిజీగా ఉంది. లెటెస్ట్ న్యూస్ ప్రకారం శ్రియ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'నక్షత్రం' సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించనుంది.

తిరుమలలో ఎన్టీఆర్...

`జై లవకుశ` చిత్రీకరణలో బిజీగా ఉన్న యంగ్టైగర్ ఎన్టీఆర్ కాస్తా విరామంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. సతీమణి లక్ష్మీప్రణితితో కలిసి మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్నాడు.

దశరథ్ దర్శకత్వంలో శర్వానంద్...

సంతోషం, మిస్టర్ పర్ ఫెక్ట్ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు దశరథ్. శౌర్యం సినిమా ప్లాప్ తర్వాత దశరథ్ మరే సినిమా చేయలేదు. మంచి స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నాడు.

చైతు సినిమా రిలీజ్ వాయిదా పడుతుందా..?

అక్కినేని నాగచైతన్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `రారండోయ్ వేడుక చూద్దాం`. ఈ సినిమాను మే 19న విడుదల చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు అక్కినేని నాగార్జున తెలియజేశారు

యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద మూడోస్థానంలో 'బాహుబలి -2'

ప్రభాస్, రాజమౌళి కాంబోలో రూపొందిన విజువల్ వండర్ బాహుబలి రెండో పార్ట్ `బాహుబలి-2` ఏప్రిల్ 28న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు, తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో కనువిని ఎరుగని రీతిలో కలెక్షన్స్ను సాధిస్తూ బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా ముందుకు సాగిపోతుంది.