మేలో మరో సినిమా ఎనౌన్స్ చేయనున్న 'ఆకతాయి'

  • IndiaGlitz, [Tuesday,April 18 2017]

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన "ఆకతాయి" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన యువ కథానాయకుడు ఆశిష్ రాజ్.. మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. "ఆకతాయి" చిత్ర నిర్మాతలైన కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ లు మరో మారు సంయుక్తంగా ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇకపోతే.. మార్చి 10న విడుదలైన "ఆకతాయి"కి సరైన థియేటర్లు దొరకని కారణంగా కొన్ని ఏరియాల్లో విడుదల కాలేదు, అందుకోసం "ఆకతాయి" చిత్రాన్ని కొన్ని ప్రాంతాల్లో మరోమారు విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ మాట్లాడుతూ.. "యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన మా "ఆకతాయి"ని ఆదరించిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. ఆ సినిమాకి లభించిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకొనే మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నాం. ఆగస్ట్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాపులర్ హీరోయిన్ ఆశిష్ రాజ్ సరసన నటించనుంది. ఓ యువ ప్రతిభాశాలిని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయనున్నాం. ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అన్నారు!

More News

జూన్ నుండి నిఖిల్ సినిమా..

స్వామిరారా,కార్తికేయ,ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ వరుస విజయాలను సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్

లాస్ట్ వర్కింగ్ డే అన్న రాజమౌళి

ఎట్టకేలకు బాహుబలి పూర్తయ్యింది. తెలుగులో సెన్సార్ పూర్తి కావడంతో విడుదలకు అన్నీ మార్గాలు క్లియర్ అయినట్లే. ఇదే విషయాన్ని దర్శకు ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలియజేశారు.

నాని విడుదల చేసిన 'అమీ తుమీ' టీజర్

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ "అమీ తుమీ" టీజర్ ను నిన్న సాయంత్రం చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.

అజిత్ టీజర్ డేట్..

తమిళ స్టార్ అజిత్ ఇప్పుడు డైరెక్టర్ శివతో వరుసగా చేస్తున్న నాలుగో సినిమా 'వివేకం'.

రెజీనా బాలీవుడ్ సినిమా ఆగిపోయిందా..?

సాధారణంగా దక్షిణాదిన నటించే హీరోయిన్స్ కు ఉత్తరాదిన మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది.