దిల్ రాజు సంస్థ‌లో వ‌రుస చిత్రాల్లో ఆమ‌ని...

  • IndiaGlitz, [Monday,June 11 2018]

ఆమ‌ని.. నిన్న‌టి త‌రం ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. మిస్ట‌ర్ పెళ్ళాం, శుభ‌ల‌గ్నం, శుభ సంక‌ల్పం, మావిచిగురు చిత్రాల‌తో న‌టిగా నిరూపించుకున్న ఆమ‌ని.. ప‌చ్చ‌ని సంసారం, అమ్మ‌దొంగా, ఘ‌రానా బుల్లోడు, వంశానికొక్క‌డు లాంటి స్టార్ హీరోల సినిమాల‌తోనూ విజ‌యాల‌ను అందుకున్నారు.

ఇటీవ‌ల కాలంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ట‌ర్న్ అయిన ఆమ‌ని.. తాజాగా భ‌ర‌త్ అనే నేనులో మ‌హేష్ బాబు త‌ల్లిగా ప్రారంభ స‌న్నివేశాల్లో క‌నిపించారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం ఆమ‌ని రెండు ఆస‌క్తిక‌ర‌మైన ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తున్నారు. ఆ చిత్రాలే శ్రీ‌నివాస క‌ళ్యాణం, హ‌లో గురు ప్రేమ కోస‌మే. ఈ రెండు చిత్రాల‌ను నిర్మిస్తోంది దిల్ రాజు సంస్థ కావ‌డం గ‌మ‌నార్హం. ఇదివ‌ర‌కు ఇదే సంస్థ‌లో ఆమ‌ని న‌టించిన ఎంసీఏ మంచి విజయం సాధించింది.

ఈ నేప‌థ్యంలో ఈ రెండు చిత్రాలు కూడా విజ‌యం సాధిస్తే.. జ‌య‌సుధ త‌ర‌హాలో దిల్ రాజు సంస్థ‌కు క‌లిసొచ్చిన మ‌రో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఆమ‌ని కూడా పేరు తెచ్చుకుంటారు.

More News

'విశ్వ‌రూపం 2' విడుద‌ల తేది ఫిక్స్

లోకనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం 'విశ్వరూపం 2'. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

ఏడాదికో చిత్రం చేస్తున్న యంగ్ హీరో

యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌కు క‌లిసొచ్చిన క‌థానాయిక‌ల్లో హెబ్బా ప‌టేల్ ఒక‌రు. కుమారి 21 ఎఫ్‌(2015)తో మొద‌లైన వీరి కాంబినేష‌న్‌ ఈడో ర‌కం ఆడో ర‌కం (2016), అంధ‌గాడు (2017) వ‌ర‌కు కొన‌సాగింది.

మీరా వ‌ర్సెస్ స‌మీరా

ఈ వారం రెండు ప్రేమ‌క‌థా చిత్రాలు తెలుగు తెర‌పై సంద‌డి చేయ‌బోతున్నాయి. ఆ  సినిమాలే.. నా నువ్వే, స‌మ్మోహ‌నం. క‌ళ్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా జ‌యేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నా నువ్వే ఈ నెల 14న

వ‌ర్మ కొత్త చిత్రం

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. రీసెంట్‌గా నాగార్జున‌, వ‌ర్మ చేసిన 'ఆఫీస‌ర్‌' డిజాస్ట‌ర్ అయ్యింది.

రాజ‌మౌళిని కూడా లైన్‌లో పెట్టిన సంస్థ‌

'బాహుబ‌లి' స‌క్సెస్‌తో రాజ‌మౌళి ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కి ఎదిగారు. ఇప్పుడు ఆయ‌నతో సినిమాలు చేయాల‌ని ఇటు స్టార్ హీరోలు, అటు ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లు క్యూ క‌డుతున్నాయి.