బన్నీ నెత్తిన పాలు పోసిన ఆమీర్ ప్రకటన.. ఇక రికార్డుల మోతేనా...!!!

మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన అల్లు అర్జున్ యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ అన్నింటికీ మించి స్టైల్స్‌లో వైవిధ్యాన్ని చూపిస్తూ స్టైలీష్ స్టార్‌గా అభిమానుల మన్ననలు పొందుతున్నారు. ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనంతో తెలుగు చిత్ర సీమకు తన వంతు సేవ చేస్తున్న బన్నీకి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అదే సమయంలో ఉత్తరాది ప్రేక్షకులను సైతం తన డబ్బింగ్ చిత్రాల ద్వారా సుపరిచితుడయ్యారు అల్లు అర్జున్.

ఈ ఏడాది సంక్రాంతికి ‘‘అల వైకుంఠపురంలో’’ అనే చిత్రంతో మెగా హిట్‌ను అందుకుని రికార్డులను తిరగరాశాడు. నటనలోనూ ఎంతో పరిణితి సాధించిన బన్నీ.. ఈ మూవీ రిజల్ట్ ఇచ్చిన ఉత్సాహంతోనే ఆ వెంటనే టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్‌తో కలిసి 'పుష్ప' అనే సినిమాను ప్రారంభించాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ మూవీకి సంబంధించిన చిత్రీకరణ విషయం చిత్ర యూనిట్ రకరకాల ప్లాన్లతో ముందుకు సాగుతోంది.

పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్‌ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు మొదటి దాని కోసం షూట్ చేస్తున్నారు. ఇక, మొదటి భాగాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట వచ్చే క్రిస్టమస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అంతా బాగానే వుంది కానీ... సరిగ్గా ఇదే సమయంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్‌ఖాన్ నటించిన లాల్‌సింగ్ చద్దాను సైతం క్రిస్మస్‌కే రిలీజ్ చేస్తామని ఆ మూవీ మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అల్లు అర్జున్‌కు తిరుగులేదు. కానీ బాలీవుడ్‌లో ఆమీర్ ఖాన్‌తో పోటీ పడటమనేది ‘పుష్ప’కి పెద్ద విషయం. దీంతో బన్నీ వెనక్కి తగ్గాల్సి వస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఇదే సమయంలో అల్లు అర్జున్ నెత్తిన పాలు పోశారు ఆమీర్ ఖాన్. క్రిస్మస్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు.

కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో మహారాష్ట్రలో థియేటర్లు మూతబడే వున్నాయి. అయితే అక్టోబర్ 22 నుంచి థియేటర్లు నడిపేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అనుమతులు ఇచ్చారు. దీంతో చాలా కాలంగా విడుదలకు నోచుకోని సినిమాలన్నీ క్యూ కట్టాయి. ఇదే క్రమంలో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు తన సినిమాను వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే స్పెషల్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆమిర్ ఖాన్. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పేశారు. తద్వారా బన్నీకి లైన్ క్లియర్ చేసేశారు లాల్‌సింగ్. మరి ‘పుష్ప’ బాలీవుడ్ లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి!

More News

ప్రేమకథల స్పెషలిస్ట్‌కి జ్ఞానోదయం.. చేతులు కాల్చుకుంది చాలు, పాత జోనర్‌కి షిఫ్ట్

నిన్ను కోరి, మజిలి లాంటి క్యూట్ లవ్‌స్టోరీస్‌తో మరో శేఖర్ కమ్ముల అన్న పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ.

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియా సేఫ్... బలైన లహరి, షణ్నూకి క్లాస్.. కెమెరాలున్నాయంటూ రవికి సజేషన్

బిగ్‌ బాస్ హౌస్ విజయవంతంగా మూడో వారాన్ని పూర్తి చేసుకుంది. ఇక ఓటింగ్‌లో తక్కువ ఓట్లు పడటంతో ఇంటి నుంచి లహరి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

‘రిపబ్లిక్’ మూవీ సాయితేజ్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుంది: ఐశ్వ‌ర్యా రాజేశ్‌

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో

'విక్రమ్'లోని కలయా నిజమా పాటను విడుదల చేసిన ప్రముఖ గీత రచయిత చంద్రబోస్

' విక్రమ్' చిత్రంలోని " *కలయా నిజమా.."* అంటూ సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ విడుదలచేశారు.

'మా ' ఎన్నికలు అవ్వగానే.. నీ క్వశ్చన్స్‌కి ఆన్సర్ ఇస్తా: పవన్‌‌కు క్లారిటీ ఇచ్చిన మోహన్ బాబు

ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల మూసివేత, ఆన్‌లైన్ టికెట్లు అమ్మే అంశాలపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.