బ్రేకింగ్: విడిపోయిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు.. షాక్ లో బాలీవుడ్

మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ జీవితంలో ఊహించని పరిణామం ఎదురైంది. దాదాపు 15 ఏళ్లపాటు అన్యోన్యంగా జీవితం సాగించిన అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు విడాకులతో విడిపోయినట్లు ప్రకటించారు. ఈ మేరకు అమీర్ ఖాన్, కిరణ్ రావు చేసిన ఉమ్మడి ప్రకటన బాలీవుడ్ వర్గాలని షాక్ లో ముంచేసింది.

ఇదీ చదవండి: వైజాగ్ రామానాయుడు స్టూడియోపై కన్ను.. సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు?

వీరి తాజా నిర్ణయంతో అమీర్ ఖాన్ అభిమానులు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. 'ఈ 15 ఏళ్ళు మా జీవితంలో ఎన్నో జ్ఞాపకాలని మిగిల్చింది. నమ్మకం గౌరవం, ప్రేమతో మేమిద్దరం జీవితంలో సంతోషాలని పంచుకున్నాం. ఇకపై మేము భార్యాభర్తలుగా ఉండబోవడం లేదు. మేమిద్దరం వేరు వేరుగా మా జీవితాలని ప్రారంభించబోతున్నాం. కానీ మా పిల్లలకు తల్లిదండ్రులుగా కొనసాగుతాం.

మేమిద్దరం విడిపోవాలని చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నాం. ఇప్పుడే అధికారికమైన ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. మాకు సన్నిహితుల, కుటుంబ సభ్యుల నుంచి బ్లెస్సింగ్స్ కావాలి. ఇది మా జీవితాలకు ఎండ్ అని భావించవద్దు.. ప్రారంభం అనుకోండి' అంటూ అమీర్ ఖాన్, కిరణ్ రావు ఉమ్మడిగా తమ విడాకులని ప్రకటించారు.

అమీర్ ఖాన్, కిరణ్ రావులు 2005 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఆజాద్ రావు ఖాన్ సంతానం. ఇది కిరణ్ రావుతో అమీర్ ఖాన్ ది రెండో వివాహం. అంతకు ముందు ఈ విలక్షణ నటుడు తన తొలి భార్య రీనా దత్త నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. అమీర్, కిరణ్ రావులు ఎలాంటి విభేదాలతో విడిపోయారనేది ఇప్పటికైతే సస్పెన్స్.

More News

వైజాగ్ రామానాయుడు స్టూడియోపై కన్ను.. సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు?

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబుపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయా అంటే అవుననే ప్రచారం ఎక్కువవుతోంది.

ఇన్స్టాలో రిచ్ వీరే: ప్రియాంకని బీట్ చేసిన కోహ్లీ.. ఒక్కో పోస్ట్ కి అన్ని కోట్లా!

ప్రస్తుతం రోజుల్లో సోషల్ మీడియా పవర్ ఫుల్ మీడియంగా మారిపోయింది. సాధారణ మీడియా కంటే జనాలు ఎక్కువగా సోషల్ మీడియానే ఇష్టపడుతున్నారు.

కరోనా రావడంలో తప్పు లేదు.. దిశా, అలియాతో గొంతు కలిపిన రష్మీ

సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలతో మనుషుల్లో మానవత్వం అంతరించి పోతోందా అనే అనుమానం కలగక మానదు.

మ్యాచ్ కి ముందు సెక్స్ చేయండి.. టీంఇండియాకి అతడి సలహా

కీలకమైన మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు ఎలాంటి క్రికెటర్ కి అయినా ఎంతోకొంత ఆందోళన ఉంటుంది.

కత్తి మహేష్ కోసం రూ.17 లక్షలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

గత శనివారం ఉదయం ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.