ఈనెల 11న అభినేత్రి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

  • IndiaGlitz, [Friday,September 09 2016]

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్ తెర‌కెక్కించిన‌ భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తుండగా, ప్రభుదేవా స్టూడియోస్‌ పతాకంపై తమిళ్‌, హిందీ భాషల్లో ప్రభుదేవా నిర్మిస్తున్నారు. ఈనెల‌ 11 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రభుదేవా, తమన్నా, చిత్ర సమర్పకుడు కోన వెంకట్‌, నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అక్టోబర్‌ 7న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, జి.వి.ప్రకాష్‌కుమార్‌, సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌, ఎడిటింగ్‌: ఆంటోనీ, ఆర్ట్‌: వైష్ణరెడ్డి, సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌.

More News

గోపీచంద్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభ‌మైయ్యాయి

గోపీచంద్ హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` తర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

అవ‌స‌ర‌మైతే స్కిన్ షోకి రెడీ - సిద్ధార్ధ హీరోయిన్ రాగిని

మొగ‌లిరేకులు సీరియ‌ల్ తో బాగా పాపుల‌ర్ అయిన సాగ‌ర్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం సిద్దార్ధ‌. ఈ చిత్రాన్ని ద‌యానంద్ రెడ్డి తెర‌కెక్కించారు.

మా ఇద్ద‌రి ఆలోచ‌న‌లు క‌ల‌వ‌డంతో జ‌ర్నీ స్టార్ట్ చేసాం...మ‌రిన్ని మంచి సినిమాలు అందిస్తాం - నాగార్జున‌

కొత్త‌వాళ్ల‌ను ప్రొత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందు ఉండే హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున‌. ఇండ‌స్ట్రీకి ఎంతో మంది న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను ప‌రిచ‌యం చేసిన నాగార్జున తాజాగా కొత్త‌వాళ్ల‌తో నిర్మ‌లా కాన్వెంట్ చిత్రాన్ని నిర్మించారు.

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు హాస్ట్ గా చిరు - నాగ్..!

మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు అన‌గానే అంద‌రికీ ఠ‌క్కున గుర్తుకువ‌చ్చే పేరు నాగార్జున‌. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు మూడు సిరీస్ ల‌కు హాస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున అంద‌రి మ‌న‌సుల‌ను గెలుచుకుని ఈ వ‌య‌సులో ప్ర‌త్యేక క్రేజ్ ఏర్ప‌రుచుకున్నారు.

బాహుబ‌లి 2 రైట్స్ పై క్లారిటీ ఇచ్చిన నాగ్..!

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. ఈ చిత్రం ఇటీవ‌ల‌ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్, అనుష్క ల‌పై ఓ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.