నిర్మాతలుగా మారుతున్న మహేష్ డిస్ట్రిబ్యూటర్స్

  • IndiaGlitz, [Saturday,January 02 2016]

శ్రీమంతుడు, రుద్రమదేవి, నాన్నకు ప్రేమతో సహా పలు విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ త్వరలోనే నిర్మాతలుగా మారుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో రూపొంద‌నున్న చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ ప్రొడ్యూస్ చేయ‌నుంది. ఈ విష‌యాన్ని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలియ‌జేశారు. నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో రెండో సినిమానే రూపొందాల్సింది కానీ స్టార్టయిన సినిమా కొన్ని కార‌ణాల‌తో ఆగిపోయింది. ఇప్పుడు సినిమా మ‌రీ ప్రారంభం కానుంది. మార్చిలో సినిమా ఓపెనింగ్ జ‌రుగుతుంది. ఏప్రిల్ 8 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంద‌ట‌. మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా సినిమా తెర‌కెక్క‌నుంద‌ని టాక్‌.

More News

నాలోని న‌టుడ్ని బ‌య‌ట‌కు తీసిన‌ స్పీడున్నోడు అంద‌రికీ న‌చ్చుతుంది అని నా న‌మ్మ‌కం. - హీరో బెల్లంకొండ శ్రీనివాస్

అల్లుడు శీను చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై..తొలి చిత్రంతోనే విజయం సాధించిన యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. భీమ‌నేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడు

పోలీస్ గెటప్ లో ప్రభాస్...

బాహుబలి కన్ క్లూజన్ చిత్రీకరణతో బిజీ అవుతున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేసేయాలనుకుంటున్నాడు.

డిక్టేటర్ శాటిలైట్ రైట్స్ ను...

బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ రూపొందిస్తున్న చిత్రం డిక్టేటర్.

స్పీడున్నాడు ఆడియో డేట్ ఫిక్స్..

బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నచిత్రం స్పీడున్నాడు.

ఆ...హార్రర్ సీక్వెల్ లో అంజలి..

ఆ..హార్రర్ మూవీ సీక్వెల్ లో అంజలి నటిస్తుందట.ఇంతకీ ఏ హార్రర్ మూవీ అనుకుంటున్నారా..?రాజు గారి గది.ఓంకార్ తెరకెక్కించిన రాజు గారి గది చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే.