close
Choose your channels

ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఒక్క సెప్టెంబర్‌లోనే 40 శాతం కేసులు..

Thursday, October 1, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. సెప్టెంబర్ నెలలో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చింది. దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో దాదాపు 40 శాతం కేసులు ఒక్క సెప్టెంబర్ నెలలోనే నమోదు కావడం గమనార్హం. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో 26 లక్షల కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కేవలం సెప్టెంబర్ నెలలోనే కరోనా కారణంగా 33 వేల మంది మృతి చెందారు. ఇక రోజువారి కేసుల విషయానికి వస్తే 80వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 86,821 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 63,12,584కు చేరుకుంది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 98,678 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం క్రమక్రమంగా పెరుగుతోంది.

గడిచిన 24 గంటల్లో 85,376 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 52,73,201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 9 లక్షల 40 వేల యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 14,23,052 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. ఇప్పటి వరకూ 7 కోట్ల 56 లక్షల టెస్టులను దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 83.53 శాతం ఉండగా.. మరణాల రేటు 1.56 శాతం ఉంది. కరోనా రికవరీ రేటు అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.