'ఆచారి అమెరికా యాత్ర' ఏప్రిల్ 27న విడుదల

  • IndiaGlitz, [Wednesday,April 11 2018]

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది. చిత్ర ట్రైలర్ కు అద్భుత స్పందన రాగా, ఎస్ ఎస్ తమన్ స్వరపరిచిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. విష్ణు, జి.నాగేశ్వర్ రెడ్డిల కలయికలో 'దేనికైనా రెడీ', 'ఈడో రకం ఆడో రకం' వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే.

‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే తరహా వినోద భరిత చిత్రం కావడంతో విష్ణు - నాగేశ్వర్ రెడ్డిలు హాట్ట్రిక్ హిట్ సాధిస్తారని నిర్మాతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, విష్ణుల కాంబినేషన్ ఈ చిత్రానికి మరో హైలైట్ గా నిలవనుంది. విష్ణు సరసన ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం కీర్తి చౌదరి మరియు కిట్టు 'పద్మజ పిక్చర్స్' బ్యానర్ పై నిర్మించగా యమ్.ఎల్. కుమార్ చౌదరి సమర్పిస్తున్నారు. సమ్మర్లో వస్తున్నా భారీ ఫామిలీ కామెడీ ఎంటర్టైనర్. అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకున్న 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 27 న భారీగా విడుదలచేయనున్నారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్.

More News

ఆ నిర్మాత‌ తో ర‌వితేజ మూడు చిత్రాల డీల్‌?

రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని.. 'రాజా ది గ్రేట్'తో మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నారు.

ప్ర‌భాస్ బాట‌లోనే సాయిధ‌ర‌మ్ కూడా వెళ‌తాడా?

సాయి ధరమ్ తేజ్ హీరోగా, యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎ.కరుణాకరన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

రికార్డు స్థాయిలో 'భరత్ అనే నేను'

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, హ్యాట్రిక్ హిట్ చిత్రాల‌ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భరత్ అనే నేను'.

రామ్ జోడిగా ప్ర‌ణీత‌..

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం దిల్‌రాజు బ్యాన‌ర్‌లో త్రినాథ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో

'బాహ‌బ‌లి 2' మ‌రో రికార్డ్‌

`బాహుబ‌లి 2` విడుద‌లై ఏడాది దాటి పోతున్న ఏదో ఒక రూపంలో వార్త‌ల్లో నిల‌స్తుంది.