'ఆచార్య' టీజర్ వస్తుందనుకుంటే అప్‌డేట్ ఇచ్చారు

మెగాస్టార్‌ చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌ పై ఎస్. నిరంజన్ రెడ్డి, రామ్‌ చరణ్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ‘ఆచార్య’ టీజర్ వచ్చేస్తుందని భావించిన అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. మంగళవారం చిరు, కొరటాల మధ్య జరిగిన సంభాషణతో నేడు టీజర్ వచ్చేస్తుందని అంతా భావించారు. అయితే టీజర్ ఎప్పుడు వస్తుందనే అప్‌డేట్ మాత్రం ఇచ్చారు.

కానీ టీజర్ రాలేదు.. దీనికి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 29 (శుక్రవారం) సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను తయారు చేసి విడుదల చేసింది. ఈ నెల 29న సాయంత్రం 4:05 గంటలకు ధర్మస్థలి తలుపులు తెరుచుకోబోతున్నాయంటూ వీడియోలో వెల్లడించారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమాలో చెర్రీ నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే చెర్రీ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. చెర్రీ కోసం కొరటాల ఓ పాటను కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ టెంపుల్ టౌన్ సెట్స్‌లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ధర్మస్థలి అనే గ్రామం వేదికగా కథ నడుస్తుందని తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More News

ఎర్రకోటపై జెండా ఎగరేసింది బీజేపీ వ్యక్తేనట

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికింది! అన్నదాతలు తలపెట్టిన కిసాన్‌ పరేడ్‌ దేశ రాజధాని ఢిల్లీని రణరంగంగా మార్చింది. ఒక్కసారిగా దేశమంతా ఢిల్లీపైనే దృష్టి సారించేలా చేసింది.

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. డిజిటల్ కరెన్నీని...

ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం. కాబట్టి నగదు కూడా డిజిటల్ కరెన్సీ రూపంలో లభ్యమైతే ఎలా ఉంటుంది? ఊహ అయితే బాగానే ఉంది కానీ ఇది సాధ్యమా అనిపిస్తోంది కదా..

పద్మ పురస్కారాలతో ప్రతిభాశీలురకు పట్టం: పవన్

గాన గంధర్వుడు దివంగత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక చేయడం ముదావహమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఎప్పుడో చెప్పకుంటే లీక్ చేస్తా: కొరటాలకు చిరు వార్నింగ్

మెగాస్టార్‌ చిరంజీవి, కాజల్‌ అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్,

'ఆర్ఆర్ఆర్‌' పోస్ట‌ర్ కాపీ కొట్టారంటూ ట్రోలింగ్‌...!

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)'.