కేసీఆర్‌కే ఝలక్.. ఆయన మాట్లాడుతుండగా..

  • IndiaGlitz, [Sunday,November 29 2020]

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీస్టేడియంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. కానీ ముగ్గురు కీలక మంత్రులు సభకు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేసీఆర్ మాట్లాడుతుండగా.. సొంత పార్టీ నేతలే ఝలక్ ఇవ్వడం షాకింగ్‌గా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాల్సి వచ్చింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఫైనల్‌గా కేసీఆర్ రంగంలోకి దిగారు. భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభకు మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాత్రం హాజరుకాలేదు. ముఖ్యంగా హరీష్‌రావు టీఆర్ఎస్ పార్టీకి బ్యాక్ బోన్ వంటివారు. ఆయన గైర్హాజరడం ఆసక్తికరంగా మారింది. సరే ఇదంతా వదిలేస్తే.. కేసీఆర్ సభలో మాట్లాడుతుండగా 130వ డివిజన్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ‘మన పాలన మనకే అన్నావ్.. మన పదవులు మనకే అన్నావ్’ అనే బ్యానర్‌లను ప్రదర్శిస్తూ తెలంగాణేతరులకు బీఫారాలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను బయటకు పంపి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది.

More News

వైట్ రైస్ తింటున్నారా? ఈ విషయం తెలిస్తే...

మనం తినే అన్నం తెల్లగా మల్లెపూవులా ఉండాలని అంతా భావిస్తూ ఉంటాం. అది ఆరోగ్యానికి చాలా హానికరమని కొందరికి మాత్రమే తెలుసు. తెల్లటి అన్నాన్ని రోజూ తింటున్నారా?

ప్రభాస్ 'ఆదిపురుష్‌'లో సీత ఎవరంటే..?

తొలి చిత్ర‌మే సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ప‌క్క‌న హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం పొందింది కృతి స‌న‌న్‌. మోడ‌లింగ్ నుంచి సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కృతికి ఆ చిత్రం (1 - నేనొక్క‌డినే) పేరు

బాలీవుడ్ కి వెళుతున్న ఎన్టీఆర్ చిత్రం

తెలుగు సినిమాల కంటెంట్ మారుతోంది. డిఫరెంట్ సినిమాలు చూడటానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిస్తుండ‌టంతో మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా అలాంటి సినిమాలు చేయ‌డానికే ఆస‌క్తి చూపుతున్నారు.

ప్రకాశ్‌రాజ్ పై మండిపడిన నాగబాబు

గ్రేట‌ర్ ఎన్నిక‌లలో పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న పోరు కాస్త ఇప్పుడు యాక్ట‌ర్స్ మ‌ధ్య‌‌కు మారింది. రీసెంట్‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఉద్దేశించి న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

పవన్ కల్యాణ్ ఒక ఊసరవెల్లి: ప్రకాష్ రాజ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఆయనను ఊసరవెల్లితో పోలిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.