రెండు వారాల్లో గుడ్‌న్యూస్ చెబుతానన్నారు.. అలీకి జగన్ క్లారిటీ ఇచ్చేశారా..?

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి మంగళవారం రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టాలీవుడ్ సమస్యలు, ఇతర ఇబ్బందులపై చర్చించేందుకు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఆ తర్వాత కమెడియన్ అలీ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. మంగళవారం కుటుంబ సమేతంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన ఆలీ.. సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమా అంశాలతో పాటు రాజకీయాలపైనా చర్చించారు. ఇటీవల సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు సీఎం జగన్ తో భేటీ అయిన సందర్భంగా అలీ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. రాజ్యసభ సీటు ఇస్తారనే విషయం తనకు తెలియదని, అలాంటి సంకేతాలు ఏవీ సీఎం జగన్ ఇవ్వలేదని చెప్పారు. అయితే అతి త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచి కీలక ప్రకటన ఉంటుందని అలీ పేర్కొన్నారు.

వైఎస్‌ఆర్‌ సీఎం కాకముందు నుంచే వారి కుటుంబంతో తనకు పరిచయం ఉందని ఆయన గుర్తుచేశారు. 2004లో వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేసిన తర్వాత కలిశానని.. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని అనలేదని అలీ చెప్పారు. గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే టికెట్‌ ఆఫర్‌ చేశారని... సమయం లేక తానే వద్దని చెప్పానని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఆహ్వానం వచ్చిందని.. అందుకే ఫ్యామిలీతో కలిసి ముఖ్యమంత్రిని కలిసినట్లు అలీ వెల్లడించారు. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని అనలేదని ఆయన గుర్తుచేశారు.

కాగా.. వైసీపీ తరపు నుంచి త్వరలో భర్తీకానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి మైనార్టీలకు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం, మండలి డిప్యూటీ ఛైర్మన్ వంటి కీలక పదవులు కట్టబెట్టిన జగన్.. ఎంపీ పదవి కూడా ఇస్తే బాగుంటుందని సమాచారం. ఈ విషయంలో సినీనటుడు అలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆలీ వైసీపీలో చేరారు. ఆ సమయంలో అసెంబ్లీకి పోటీ చేయాలని భావించినా జగన్ సూచనతో ఆ ఆలోచను ఆయన విరమించుకున్నారు. .

అయితే గడిచిన రెండున్నరేళ్లుగా అలీకి పదవి దక్కుతుందని వార్తలు రావడం.. చివరి నిమిషంలో నిరాశ ఎదురవ్వడం జరుగుతూ వస్తోంది. కానీ ఈ సారి మాత్రం కన్ఫర్మ్ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డితో పాటు ఓ బీసీ నేతకు సీటు ఖాయమైనట్లు తెలుస్తోంది. మరోసీటు ఎస్సీలకు, నాలుగో సీటు మైనారిటీలకు ఇస్తారని టాక్. మరి జగన్ మనసులో ఏముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More News

ప్రభుత్వం ఇన్విటేషన్ పంపింది, నాన్నకి అందనివ్వలేదు.. ఎవరిపనో తెలుసు: మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ ముగిసిన అనంతరం మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు.

యువ ప్రేక్షకులకు నచ్చేలా "వర్జిన్ స్టోరి" ఉంటుంది - నిర్మాత లగడపాటి శ్రీధర్

నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా "వర్జిన్ స్టోరి". కొత్తగా రెక్కలొచ్చెనా అనేది ఉపశీర్షిక.

పంట నష్టపోయిన రైతులకు జగన్ సర్కార్ బాసట.. అన్నదాతల ఖాతాల్లోకి రూ.542 కోట్లు విడుదల

రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

చిక్కుల్లో లాలూ ప్రసాద్ యాదవ్.. ఆ స్కామ్‌లో దోషిగా నిర్ధారణ, మరోసారి జైలుకు తప్పదా..?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు.

జగన్ వద్దకు మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా, ఇండస్ట్రీ చూపంతా అటే

తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై గత వారం మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖల బృందం ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.