హీరో సూర్యపై విమర్శల దాడి.. సీపీఎం, డివైఎఫ్ఐ మద్దతు!

  • IndiaGlitz, [Tuesday,July 06 2021]

నీట్ పరీక్షలు, సెన్సార్ చట్ట విధి విధానాలపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు స్టార్ హీరో సూర్య. నీట్ పరీక్షల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు అని సూర్య అన్నారు. నీట్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు సూర్య మద్దతు తెలిపారు. అలాగే సెన్సార్ చట్టంలో సవరణల వల్ల సినిమారంగం కూడా నష్టపోతోందని సూర్య కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

దీనితో సూర్యపై బిజెపి నేతలు విమర్శల దాడి ప్రారంభించారు. లీగల్ గా కూడా చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. సూర్య వైఖరి ఇలాగే కొనసాగితే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తమిళనాడు యూత్ బిజెపి వింగ్ బహిరంగ ప్రకటన చేసింది.

బీజీపీ సూర్యపై విమర్శలకు దిగుతుండడంతో సీపీఎం రంగంలోకి దిగింది. సూర్యకు మద్దతుగా నిలిచింది. బిజెపి నేతలు సూర్య పట్ల బెదిరింపు ధోరణితో వ్యవహరించడం హేయమైన చర్య అని సిపిఎం ఎంత కె. బాలకృష్ణన్ అన్నారు.

నీట్ వల్ల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులని సూర్య తెలిపారు. దీనికే ఆయనపై బెదిరింపులకు దిగితే భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ ఉంది అని సిపిఎం నేతలు అన్నారు. సూర్యకు డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ అఫ్ ఇండియా(డివైఎఫ్ఐ) కూడా మద్దతు తెలిపింది. సూర్యపై బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. నీట్ వల్ల 17 రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని డివైఎఫ్ఐ పేర్కొంది.

వివాదాలకు దూరంగా ఉండే సూర్య నీట్ పై వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొన్నారు. విద్యార్థులకు మద్దతు తెలిపినందుకు ఆయన్ని బిజెపి నేతలు టార్గెట్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూర్య.. టీజె జ్ఞానవేల్ దర్శత్వంలో నటిస్తున్నారు.

More News

వకీల్ సాబ్ ప్రూవ్ చేసింది.. అల్లు అరవింద్ ప్రోత్సాహంతో ముందుకు..

ప్రముఖ పీఆర్వో, నిర్మాత శ్రీనివాస్ కుమార్(ఎస్కెఎన్) జూలై 7న తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు.

మంత్రి కేటీఆర్ ని కలిసిన సోనూసూద్.. ఆ ఇద్దరు దర్శకులు కూడా..

సోనూసూద్ దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులని సొంతం చేసుకున్నాడు. బడా సెలెబ్రిటీలు కూడా సోనూసూద్ అభిమానులుగా మారిపోతున్నారు.

ఇండియాలో ప్రభాస్, పృథ్విరాజ్.. వర్చువల్ ప్రొడక్షన్ విప్లవం మొదలు

ఫిల్మ్ మేకింగ్ అనేది స్థిరమైన ప్రక్రియ కాదు. కాలానుగుణంగా, టెక్నాలజీ పరంగా అనేక మార్పులు వస్తుంటాయి.

శ్రీయ ప్రైవేట్ పార్ట్ పై ముద్దు పెట్టేసిన భర్త.. వీడియో వైరల్!

శ్రీయ శరన్, ఆమె భర్త ఆండ్రు కొశ్చివ్ రెక్కలున్న పక్షుల్లాగా ఎక్కడపడితే అక్కడకు వెకేషన్స్ కి వాలిపోతుంటారు.

సలార్ లో దిమ్మతిరిగిపోయే ఛేజ్ సీన్.. వింటేజ్ బైక్ పై ప్రభాస్

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కావస్తోంది. ఈ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.