ఆ తప్పు జీవితంలో చెయ్యను: చార్మి

  • IndiaGlitz, [Sunday,May 09 2021]

పంజాబీ ముద్దు గుమ్మ చార్మీ కౌర్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్ చేసుకుంటున్నట్టు ఇటీవల మీడియాలో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే.. చార్మి మాత్రం తనకు పెళ్లి మీద ఎలాంటి ఆసక్తి లేదంటూ ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తోంది. అయినా కూడా రూమర్స్‌కి మాత్రం చెక్ పడటం లేదు. ప్రేక్షకుల ఆసక్తికి అనుగుణంగా ముద్దుగుమ్మల పెళ్లి వార్తలను వాళ్లతో సంబంధం లేకుండానే సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తూ వస్తున్నారు. దీనికి మీడియా కూడా తోడవడంతో ఇవెప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

తాజాగా తన పెళ్లి వార్తలపై చార్మి మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తను ఇప్పుడు తన కెరీర్ పరంగా ది బెస్ట్ ఫేజ్‌లో ఉన్నానని వెల్లడించింది. అంతేకాదు తను చాలా సంతోషంగా ఉన్నానని.. పెళ్లి చేసుకోవడం వంటి తప్పును చేయబోనని చార్మి కుండబద్దలు కొట్టేసింది. ‘‘ప్రస్తుతం నేను నా కెరీర్‌ పరంగా బెస్ట్ ఫేజ్‌లో ఉన్నాను. నా జీవితాన్ని నేను చాలా సంతోషంగా గడుపుతున్నాను. జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పును ఎప్పటికీ చేయబోను’’ అని చార్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

పూరి జగన్నాథ్‌తో కలిసి చార్మి ఆయన రూపొందించే చిత్రాలకు కీలక బాధ్యతలు తీసుకుంటూ వస్తోంది. నిర్మాణంలో కూడా భాగమవుతోంది. పూరి డైరెక్ట్ చేసి నిర్మాతగా తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి చార్మి సహ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా సక్సెస్‌తో అమ్మడి కెరీర్ ఒక గాడిన పడింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న లైగర్ చిత్రానికి కూడా చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే చార్మికి బాగా కలిసొస్తుంది.

More News

జీ 5లో 'బట్టల రామస్వామి బయోపిక్కు' ఎక్స్‌క్లూజివ్‌ & డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్

వీక్షకులకు వినోదం అందించడమే పరమావధిగా డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఎప్పటికప్పుడు  సందడి చేస్తున్న అగ్రగామి ఓటీటీ వేదిక జీ 5.

హీరోలూ జీరోలవకండి.. కాస్త ఊపిరి అందించండి..

ప్రస్తుతం భారతదేశం ఎంత ప్రమాద స్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

కడప జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి

కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిళ్ళపల్లె శివారులోని తిరుమల కొండ సమీపంలో ఉన్న బైరటీస్ గనిలో భారీ ప్రమాదం జరిగింది.

కొవిడ్‌ వ్యాక్సిన్ కొరత.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం

తెలంగాణలో కొవిడ్‌ టీకా డోసుల కొరత దృష్ట్యా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పవన్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.