ఓ వ్యక్తిని నమ్మి మోసపోయిన నిక్కీ గల్రానీ

  • IndiaGlitz, [Friday,April 16 2021]

బిజినెస్ ఏదైనా సరే.. కలిసొచ్చిందా.. వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు. కలిసి రాలేదా.. అంతా కొలాప్స్. అయితే పార్ట్‌నర్‌షిప్ బిజినెస్ ఏదైనా ఎప్పటికైనా ఇబ్బందులకే దారి తీస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీలంతా కాస్త సంపాదించగానే దానిని బిజినెస్‌లో పెట్టి రెట్టింపు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. అలాగే కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీ కూడా బిజినెస్‌పై దృష్టి సారించింది. ఓ హోటల్ బిజినెస్‌లోకి దిగింది. అయితే ఆమె స్వయంగా ఏ హోటల్‌ని పెట్టలేదు. ఓ హోటల్ యజమానిని నమ్మి బిజినెస్ పార్ట్‌నర్‌గా చేరి మోసపోయింది. ఈ విషయాన్ని ఆ ముద్దుగుమ్మ స్వయంగా వెల్లడింది.

‘డార్లింగ్‌’, ‘కలకలప్పు-2’ వంటి చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నిక్కీ... సినిమాలపై వచ్చిన డబ్బుతో బిజినెస్ చేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా బెంగుళూరులోని కోరమంగళ అనే ప్రాంతంతో నిఖిల్‌ అనే వ్యక్తితో కలిసి తాను రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టి హోటల్‌ని ప్రారంభించింది. వీరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం నిఖిల్ నెలకు ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ హోటల్‌ను ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకూ నిఖిల్ తనకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని నిక్కీ వాపోయింది.

ఒప్పందం ప్రకారం డబ్బు ఇవ్వకపోగా తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బును సైతం తిరిగి ఇవ్వలేదని నిక్కి చెబుతోంది. ఈ మేరకు తనను మోసం చేసిన హోటల్ యజమాని నిఖిల్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం నెలకు ఇవ్వాల్సిన లక్ష రూపాయలను ఇప్పటి వరకూ ఏ నెలా ఇవ్వలేదని.. పైగా తాను పెట్టిన డబ్బును సైతం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్ యజమాని నిఖిల్‌ని పిలిచి విచారణ నిర్వహిస్తున్నారు.

More News

మూఢనమ్మకంతో నెలల చిన్నారి గొంతుకోసి హతమార్చిన తల్లి

మూఢ నమ్మకాల మత్తులో మరీ బాగా చదువుకున్న వారే పడుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పదో తరగతి పరీక్షల రద్దు.. ఇంటర్ వాయిదా..

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

‘అన్నియన్’ నిర్మాతకు డైరెక్టర్ శంకర్ స్ట్రాంగ్ రిప్లై

‘అన్నియన్’ రీమేక్ వివాదం ముదురుతోంది. ‘అన్నియన్’ మూవీని హిందీలో రీమేక్ చేస్తే లీగల్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆ చిత్ర నిర్మాత రవిచంద్రన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

సాక్షికి షాక్ ఇచ్చిన షర్మిల..

మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌, మ్యూజికాలజిస్ట్ రాజా ఇక లేరు

‘హాసం’ రాజాగా సుపరిచితులైన సీనియర్‌ జర్నలిస్ట్‌, మ్యూజికాలజిస్ట్ రాజా(70) ఇక లేరు. గురువారం ఆయన హైదరాబాద్‌లో కన్ను మూశారు.