బాలీవుడ్ ఇక అంతమే.. టాలీవుడ్‌దే ఆ ప్లేస్, ఎప్పుడో చెప్పా: పాయల్ కామెంట్స్ వైరల్

  • IndiaGlitz, [Saturday,February 12 2022]

దేశంలో ఇప్పుడు తెలుగు సినిమా ప్రభ వెలుగొందుతోంది. కమర్షియల్ సినిమాలు తప్పించి.. భారీ బడ్జెట్, ప్రయోగాత్మక సినిమాలు తీయలేరంటూ విమర్శలు చేసినవారు సైతం ఇప్పుడు టాలీవుడ్‌ను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. బాలీవుడ్ సహా అన్ని భాషలకు చెందిన హీరో హీరోయిన్లు, టెక్నీషియన్లు టాలీవుడ్ బాటపడుతున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ .. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం తెలుగు సినిమా ఖ్యాతిని గురించి ప్రశంసల వర్షం కురిపించారంటే .. టాలీవుడ్ సత్తా ఏంటో ఇప్పుడు అర్ధం చేసుకోవచ్చు. అయితే టాలీవుడ్ అభ్యున్నతిని తాను ఎప్పుడో ఊహించానని.. దీనిపై అప్పుడు తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు సెటైర్లు వేశారంటూ మండిపడుతున్నారు ‘‘ఊసరవెల్లి’’ నటి పాయల్ ఘోష్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో నటించాలని, కలిసి డ్యాన్సులు చేయాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్లే కోరుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో అలియా భట్, దీపికా పడుకోణె వంటి తారలున్నారు. ఈ నేపథ్యంలో వీరు చేసిన కామెంట్స్‌కు కౌంటరిస్తూ.. బాలీవుడ్‌పై విరుచుకుపడ్డారు పాయల్. ఓ రెండేళ్ల క్రితం మీరా చోప్రా తనకు ఎన్టీఆర్ తెలియదంటూ చేసిన కామెంట్లపై పాయల్ ఘోష్ ఎలా మండిపడిందో అందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ గ్లోబర్ స్టార్, మంచి మనిషి.. అన్న సంగతిని తాను అప్పట్లోనే చెప్పానని కానీ నన్ను అందరూ విమర్శించారని పాయల్ గుర్తుచేశారు. తాను తొలి నుంచి ఎన్టీఆర్ సత్తా గురించి చెబుతూ వచ్చానని.. కానీ ఇప్పుడు ప్రపంచానికి తెలిసి వస్తుందంటూ పాయల్ ట్వీట్ చేశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ త్వరలోనే బాలీవుడ్‌ని బీట్ చేస్తుందని ఆమె జోస్యం చెప్పారు. అసభ్యకరమైన సన్నివేశాలు, మాటల్ని ఇకనైనా సినిమాల్లో చూపించడం మానకుంటే బాలీవుడ్‌‌కి అంతం తప్పదని పాయల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More News

షూటింగ్‌లో తీవ్రంగా గాయపడిన విశాల్.. ఆసుపత్రికి తరలింపు

మనకి రెండు గంటల పాటు వినోదం అందించేందుకు హీరోలు, హీరోయిన్లు ఎంతో కష్టపడతారు. ఈ క్రమంలో ప్రాణాలు పొగొట్టుకున్న వారు కూడా వున్నారు.

మరణానంతరం నా అవయవాలు దానం చేస్తా.. పుట్టినరోజు నాడు జగపతిబాబు కీలక ప్రకటన

అవయవదానం.. తాను చనిపోతూ మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపే ఓ మహత్తర కార్యక్రమం.

‘సర్కార్ వారి పాట’ ఫస్ట్ సింగిల్ : ‘‘కళావతి’’ సాంగ్ ప్రోమో కేక.. మీరు చూశారా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట' సినిమాపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.

చీప్ స్టార్.. ‘‘మీకు అరటిపండ్లు తీయడం బాగా వచ్చట’’ : రవితేజపై డైరెక్టర్ రమేశ్ వర్మ భార్య కామెంట్స్

ఎప్పుడూ తన పనేదో తాను చూసుకుని.. వున్నంతసేపు తన ఎనర్జీ, పంచులతో అందరినీ నవ్వించే మాస్ మాహారాజా రవితేజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి.

మోహన్‌బాబు వద్దకు మంత్రి పేర్నినాని.. ఈ కొత్త ట్విస్ట్ ఏంటో, టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని శుక్రవారం భేటీ అయ్యారు.