సాయిపల్లవికి ‘సినిమా’ కష్టాలు.. మారువేషంలో సర్కార్ వారి పాట థియేటర్‌కి, వీడియో వైరల్

  • IndiaGlitz, [Monday,May 16 2022]

సెలబ్రెటీల జీవితం విలాస వంతంగా వుంటుందని , రాచమర్యాదలు, అందమైన జీవితమేనని అంతా భావిస్తారు. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. పబ్లిక్‌లోకి రావడానికి సెలబ్రెటీలు ఎంతో ఇబ్బంది పడతారు. వచ్చింది ఫలానా వ్యక్తి అని ఏ మాత్రం అనుమానం వచ్చినా జనాలు చుట్టుముట్టేస్తారు. అందుకే పబ్లిక్‌ లైఫ్‌ను సెలబ్రెటీలు ఎంజాయ్ చేయలేరు. అత్యవసరమైతేనే మారు వేషాల్లోనే బయటకు వస్తారు. తాజాగా ఇలాంటిదే ఓ ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఒక సినిమా చూడటానికి సాహసం చేయాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే... సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘‘సర్కార్ వారి పాట’’ సినిమా చూడటానికి వచ్చింది సాయిపల్లవి. అనంతరం సినిమా అయిపోయాక ముసుగు వేసుకుని , మాస్క్ ధరించి, ఫోన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లోని పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే సాయిపల్లవి ఇలా సాహసాలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో నానితో కలిసి నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని ఆమె మారు వేషంలో ప్రేక్షకులతో పాటు చూశారు. బుర్కా ధరించి థియేటర్‌కి వచ్చిన సాయి పల్లవిని తిరిగి ఇంటికి వెళ్లబోయే ముందు అక్కడున్న జనాలు గుర్తించారు. అయినప్పటికీ వాళ్లందరినీ పలకరిస్తూ కారులో వెళ్ళిపోయింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సాయిపల్లవి నటించిన విరాటపర్వం విడుదలకు సిద్ధమైంది. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రానా హీరోగా నటిస్తున్నారు. దీనికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.. ఇందులో ప్రియమణి కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే ‘గార్గి’ పేరుతో మల్టీ లింగ్వల్ మూవీ సాయి పల్లవి చేస్తున్నారు.

More News

ఆ 200 మంది కౌలు రైతులే .. పోలీస్ రికార్డుల్ని చెక్ చేసుకోండి : జగన్‌కు నాదెండ్ల చురకలు

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మండిపడ్డారు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రైతులను మోసం చేయడంలో సి.బి.ఐ.

విజయ్ దేవరకొండ, సమంత 'ఖుషి' ఫస్ట్ లుక్ విడుదల

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ సినిమాలో నటిస్తున్నారు.

బాలయ్య చేతుల మీదుగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు... ఘనంగా ఏర్పాట్లు

పౌరాణికమైనా, సాంఘీకమైన, జానపదమైన తనదైన అద్భుతమైన నటనతో వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు

హార్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా టచ్ అవుతుంది. దర్శకురాలు జీవిత రాజశేఖర్

కొన్ని పరిస్థితుల వలన దర్శకురాలు అయ్యాను తప్ప నిజానికి నాకు  డైరెక్షన్ చేయాలనే జీల్ ఎప్పుడూ లేదు అన్నారు దర్శకురాలు జీవిత రాజశేఖర్.

నువ్వు నేను ప్రేమ అంటున్న స్టార్ మా !

ఇద్దరు మనుషులు ప్రేమగా ఎదురుపడితే, ఒకరినొకరు ఇష్టపడితే ప్రేమ పుడుతుంది. సాధారణంగా జరిగేది ఇదే. కానీ అస్సలు ఇష్టపడే ఛాన్స్ లేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది?