కన్న‌డ‌లో రీమేక్‌కానున్న అడివి శేష్ చిత్రం..?

  • IndiaGlitz, [Friday,April 10 2020]

ఈ మ‌ధ్య తెలుగు సినిమాల ట్రెండ్ మారింది. డిఫరెంట్ సినిమాలు రూపొందుతున్నాయి. కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయ‌డానికి హీరోలు, చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపుతున్నారు. ఆ కోవ‌లో అడివిశేష్ హీరోగా వెంక‌ట్ రామ్‌జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘ఎవ‌రు’. గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం భారీ హిట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాను క‌న్న‌డంలో రీమేక్ చేయ‌బోతున్నార‌ట‌. వివ‌రాల మేర‌కు దిగాంత్ హీరోగా క‌న్న‌డ‌లో సినిమా రూపొందనుంద‌ట‌.

అడివిశేష్ పాత్ర‌లో దిగాంత్ న‌టించ‌డం వ‌ర‌కు ఓకే. కానీ.. క‌థ‌లో కీల‌క‌మైన రెజీనా క‌సండ్ర పాత్ర‌ను క‌న్న‌డ‌లో ఎవ‌రు పోషిస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. తెలుగులో రెజీనా పాత్ర‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. హాలీవుడ్ సినిమా నుండి బాలీవుడ్‌లో బ‌ద్లా సినిమాను రీమేక్ చేస్తే.. బాలీవుడ్ నుండి తెలుగులోకి ఎవ‌రు అనే పేరుతో సినిమా రీమేక్ అయ్యింది. అయితే తెలుగులో అడివిశేష్ స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్‌ను వీలైనంత‌గా మార్చారు.

ప్ర‌స్తుతం అడివిశేష్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ముందుగా మ‌హేశ్ నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై మేజ‌ర్ సినిమాను చేయ‌నున్నారు. అలాగే గూఢ‌చారి సీక్వెల్‌గా గూఢ‌చారి 2ను రూపొందించనున్నారు.

More News

లేడీ విలన్‌తో బాలయ్య ఢీ..?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తానంటోన్న రానా !!

రానా ద‌గ్గుబాటి హీరోగా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా రాణిస్తున్నారు. ఇటీవ‌ల కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

అందుకే సినిమాల‌కు దూర‌మ‌య్యానంటున్న శ్రీముఖి

బుల్లితెర‌, వెండితెర‌కు ఒక‌ప్పుడు దూరం ఎక్కువ‌గా ఉండేది. వెండితెర‌పై డీగ్లామ‌ర్ అయిన వారే బుల్లి తెర‌పై క‌నిపించ‌డానికి ఆస‌క్తి చూపేవారు.

క‌రోనాపై పోరుకు మ‌హేశ్ కొత్త ఆలోచ‌న‌..!!

కోవిడ్ 19 ప్ర‌భావంతో ప్ర‌పంచం ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోయింది. అన్నీ రంగాలు స్తబ్దుగా అయిపోవడం అభివృద్ధి ఆగిపోయింది. ఉన్న‌త, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం

నర్సింగ్‌ యాదవ్‌ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.