close
Choose your channels

కోవిడ్ ఎఫెక్ట్ .. అడవి శేష్ ‘‘మేజర్’’ సినిమా విడుదల వాయిదా

Monday, January 24, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్‌లు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పలు రాష్ట్రాల్లో నైట్‌కర్ఫ్యూలు విధించడం, 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లకు అనుమతించడంతో సినిమాల విడుదలలపై ప్రభావం పడింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడ్డాయి. దీనికి తోడు పలువురు హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు కోవిడ్ బారినపడ్డారు. పరిస్ధితి ఇలాగే కొనసాగితే రెండు, మూడు నెలల పాటు సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా అడవి శేష్ నటించిన ‘‘మేజర్’’ సినిమా విడుదల వాయిదా పడింది.

26/11 ముంబయి ఉగ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ‘‘మేజర్’’ సినిమాను డైరెక్టర్‌ శశికిరణ్‌ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. సోనీ పిక్చర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో మేజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మురళి శర్మ, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఫిబ్రవరి 11న ‘‘ మేజర్ ’’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశంలో కోవిడ్ కారణంగా నెలకొన్న పరిస్ధితుల కారణంగా రిలీజ్‌పై చిత్ర యూనిట్ వెనక్కి తగ్గింది. దేశం కోసమే ఈ సినిమాను సిద్ధం చేస్తున్నామని.. కాబట్టి పరిస్థితులు అనుకూలించినప్పుడే విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.