బెల్లంకొండ తరువాత రామ్ చరణ్ తోనే..

  • IndiaGlitz, [Saturday,September 02 2017]

స‌మంత‌.. ఎంతోమంది యువ క‌థానాయ‌కుల‌కు క‌ష్ట కాలంలో క‌లిసొచ్చిన క‌థానాయిక. లేడీ ల‌క్‌గా పేరు తెచ్చుకున్న ఈ చెన్నై సుంద‌రి అనతి కాలంలోనే నెం.1 హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ఏడు చిత్రాల‌తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో సోలో హీరోయిన్ గా సంద‌డి చేసిన స‌మంత‌.. ఈ మ‌ధ్య కాలంలో ఇద్ద‌రు లేదా ముగ్గురు హీరోయిన్‌లు ఉన్న సినిమాల్లోనే ఎక్కువ‌గా ద‌ర్శ‌న‌మిస్తోంది.

మూడేళ్ల క్రితం బెల్లంకొండ శ్రీ‌నివాస్‌ హీరోగా వ‌చ్చిన 'అల్లుడు శీను' త‌రువాత తెలుగులో 'ర‌భ‌స‌, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, బ్ర‌హ్మోత్స‌వం, అఆ, జ‌న‌తా గ్యారేజ్' చిత్రాలు చేసింది స‌మంత‌. ఇవ‌న్నీ కూడా మ‌ల్టీ హీరోయిన్ స‌బ్జెక్ట్‌లే. ఇక రానున్న 'రాజు గారి గ‌ది 2' కూడా అలాంటిదే. ఇందులో స‌మంత‌తో పాటు సీర‌త్ క‌పూర్ కూడా న‌టిస్తోంది. అయితే రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న 'రంగ‌స్థ‌లం'లో మాత్రం స‌మంత సోలో హీరోయిన్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. మొత్తానికి చాన్నాళ్ల త‌రువాత స‌మంత‌కి సోలో హీరోయిన్‌గా ఆఫ‌ర్ ద‌క్కింద‌న్న‌మాట‌.

More News

చేతన్ చీను 'దేవదాసి' మోషన్ పోస్టర్ విడుదల

రాజుగారి గది ఫేమ్ చేతన్ చీను,సుడిగాడు ఫేమ్ మోనాల్ గజ్జర్ కలిసి నటిస్తున్న చిత్రం 'దేవదాసి'

నితిన్ కి ఆయన శిష్యుడైనా కలిసొస్తాడా?

గతేడాది 'అఆ'తో ఓ బ్లాక్బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న నితిన్ కి..

రకుల్ ఆవిషయంలో హ్యాట్రిక్ కొడుతుందా?

తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

డబ్బింగ్ కార్యక్రమాల్లో సునీల్ - ఎన్.శంకర్ ల సినిమా

'జై బోలో తెలంగాణా'లాంటి యునానిమస్ హిట్ అనంతరం శంకర్ స్వీయ దర్శకత్వంలో

ప్రోడ్యూసర్ దిల్ రాజు వాయిస్ ఓవర్ తో సెప్టెంబర్ 15న 'ఉంగరాల రాంబాబు' విడుదల

సునీల్ హీరోగా,మియాజార్జ్ జంటగా,క్రాంతి మాధవ్ దర్శకత్వంలో