close
Choose your channels

అప్పుడు చిరంత‌న్ భ‌ట్‌.. ఇప్పుడు కీర‌వాణి..

Saturday, June 2, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అప్పుడు చిరంత‌న్ భ‌ట్‌.. ఇప్పుడు కీర‌వాణి..

'గమ్యం' సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన క్రిష్ .. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సినిమాలు మాత్రమే చేసారు. క్రిష్ తొలి నాలుగు చిత్రాలను గమనిస్తే.. ఏ సినిమాకి కూడా అంత‌కుముందు చిత్రాల‌కు ప‌నిచేసిన సంగీత ద‌ర్శ‌కుడు రిపీట్ కాలేదు.

'గమ్యం' (ఇ.ఎస్.మూర్తి, ఆర్.అనిల్), 'వేదం' (ఎం.ఎం.కీరవాణి), 'కృష్ణం వందే జగద్గురుం' (మణిశర్మ), 'కంచె' (చిరంతన్ భట్) సినిమాల విష‌యంలో ఇది గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే కంచె స్వ‌ర‌క‌ర్త చిరంతన్ భట్‌కు 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో రెండోసారి అవకాశం ఇచ్చారు. బాలకృష్ణ కెరీర్‌లో 100వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 2017 సంక్రాంతికి విడుద‌లై విజ‌యం సాధించింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మరో సంగీత దర్శకుడితో కూడా రెండోసారి జట్టు కట్టనున్నారు క్రిష్. ఆ సంగీత ద‌ర్శ‌కుడే కీర‌వాణి. మహానటుడు ఎన్.టి.రామారావు బయోపిక్ 'య‌న్.టి.ఆర్' కోసం కీర‌వాణి స్వ‌రాలు అందించ‌నున్నారు. బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా తెర‌పైకి రానుంది.

క్రిష్‌తో రెండోసారి చిరంత‌న్ భ‌ట్ సినిమా చేసిన సంద‌ర్భంలోనూ.. ఇప్పుడు కీర‌వాణి రెండోసారి సినిమా చేస్తున్న సంద‌ర్భంలోనూ క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ‌నే కావ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.