నితిన్ త‌రువాత బెల్లంకొండ శ్రీ‌నివాస్‌ సినిమాలో..

  • IndiaGlitz, [Thursday,March 08 2018]

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఇటీవ‌లే ఓ సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌కుడిగా శ్రీనివాస్ రెడ్డికి ఇదే తొలి చిత్రం. ఈ మూవీని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంటినేని నిర్మిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లకు అవకాశమున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అధికారికంగా ఇంకా క‌న్‌ఫ‌ర్మ్ చేయ‌లేదు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో 'ఒకరికి ఒకరు' ఫేమ్ శ్రీరామ్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నార‌ని తెలిసింది. ఇటీవ‌లే నితిన్ హీరోగా వ‌చ్చిన‌ 'లై' చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో నటించారు శ్రీరామ్. ఆ త‌రువాత చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

థ్రిల్లర్ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కూడా ఆయ‌న పూర్తి నిడివిగల పాత్రను పోషించనున్నారని సమాచారం. మార్చి 2వ తేదీ నుంచి చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీవాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న 'సాక్ష్యం'లోనూ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తున్న ఈ సినిమా మే 11న విడుదలకు ముస్తాబవుతోంది.

More News

భ‌ర‌త్ అనే నేను.. కైరా పాత్ర ఏంటంటే..

మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ సినిమా 'భరత్ అనే నేను'. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మార్చి 16న న‌య‌న‌తార‌ 'క‌ర్త‌వ్యం' విడుద‌ల‌

ద‌క్షిణాది అన్ని భాష‌ల్లో న‌టించి స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌ ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వం లో శివ లింగ, విక్రమ్ వేధా వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్ రవీంద్రన్ మరియు క్రేజి ప్రాజెక్ట్ ల‌తో విజ‌యాల్ని సాధిస్తున్న‌ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తం గా  ట్ĸ

దేవిశ్రీ ప్రసాద్ చేతుల మీదుగా U -కథే హీరో మొదటి పాట విడుదల

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్  చేతులమీదుగా  శ్రీమతి నాగానిక సమర్పణ లో కొవెరా క్రియేషన్స్ బ్యాన ర్ పై నూతన దర్శకుడు కొవెర దర్శకత్వం వహిస్తున్న "U కథే హీరో" సినిమాలోని మొదటి పాటను విడుదల చేేశారు.

రవితేజ, శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ' ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ, ఎంటర్ టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ లాంటి శ్రీనువైట్లల క్రేజీ కాంబినేషన్ లో 'దుబాయ్ శీను' తర్వాత మళ్లీ కలిసి చేయబోతున్న చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'.

రామ్‌, దిల్‌రాజు 'హ‌లో గురు ప్రేమ కోస‌మే' ప్రారంభం

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ఈరోజు హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఎర్నేని న‌వీన్‌, స్ర‌వంతి ర‌వికిషోర్ స్క్రిప్ట్‌ను డైరెక్ట‌ర్‌కు అందించారు.